Sarkar Live

“ఎయిర్ కండిషనింగ్‌కి కొత్త నియమాలు: 20°C కంటే చల్లగా వద్దంట!” AC Temperature Guidelines 2025

AC Temperature Guidelines India 2025 భారతదేశంలోని ఎయిర్ కండిషనర్ల వినియోగంలో ఏసీల ఉష్ణోగ్రతలను ప్రామాణీకరించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను తీసుకురావాలని భావిస్తోంది. ACల ఉష్ణోగ్రతలను 20°C కంటే తక్కువకు లేదా 28°C కంటే ఎక్కువకు ఉంచకూడదని నిబంధనలను

AC Temperature Guidelines

AC Temperature Guidelines India 2025 భారతదేశంలోని ఎయిర్ కండిషనర్ల వినియోగంలో ఏసీల ఉష్ణోగ్రతలను ప్రామాణీకరించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను తీసుకురావాలని భావిస్తోంది. ACల ఉష్ణోగ్రతలను 20°C కంటే తక్కువకు లేదా 28°C కంటే ఎక్కువకు ఉంచకూడదని నిబంధనలను రూపొందిస్తోంది. ఈవిషయాన్ని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) తాజాగా ప్రకటించారు.

“ఎయిర్ కండిషనింగ్ ప్రమాణాలకు సంబంధించి, త్వరలో ఒక కొత్త నిబంధన (AC Temperature Rules) అమలు చేయనున్నారు. ACల ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నుండి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య సెట్ చేయబడుతుంది. అంటే మనం 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ చల్లబరచలేం.. అలాగే 28 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి చేయలేం” అని ఖట్టర్ చెప్పారు.

AC Temperature Guidelines : ఎందుకీ మార్పు?

వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, AC వినియోగం పెరగడం వలన విద్యుత్ డిమాండ్‌ తారస్థాయికి చేరుతోంది. విద్యుత్ వనరులను పొదుపు చేయడమే కాకుండా వినియోగదారుల విద్యుత్ బిల్లులను (Power Saving) తగ్గించడమే ఈ నిర్ణయానికి కారణమని చెబుతున్నారు.

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) సూచనల ప్రకారం, స్టార్ రేటింగ్ ఉన్న ACల డిఫాల్ట్ సెట్టింగ్ 24°Cగా ఉండాలి. వాణిజ్య భవనాల్లో ఇది 24-25°C మధ్య ఉండేలా సూచించారు. కాగా ఈ మార్పులు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడమే కాక, దీర్ఘకాలికంగా పర్యావరణానికి ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ACలు 16°C నుంచి 30°C వరకు

ఖట్టర్ మాట్లాడుతూ – “ACల కనిష్ఠ ఉష్ణోగ్రతను 20°Cగా, గరిష్ఠంగా 28°Cగా సెట్ (AC Usage Limit) చేయాలని మేము నిర్ణయించాం. ఇది భవిష్యత్తులో ఒకే రకమైన వినియోగ ధోరణులను తీసుకురాగలదు,” అన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ACలు 16°C నుంచి 30°C వరకు ఉష్ణోగ్రతలను సెట్ చేసే అవకాశం ఇస్తున్నాయి. కానీ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత ఈ పరిమితులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. దీనిని ఒక ప్రయోగాత్మక దశగా అభివర్ణిస్తూ, హర్యానా మాజీ ముఖ్యమంత్రి, “ఉష్ణోగ్రత సెట్టింగులను ప్రామాణీకరించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ రకమైన ప్రయోగం ఇదే తొలిసారి” అని అన్నారు.

ఈ నిబంధన కేవలం నివాస, వాణిజ్య సంస్థలకు మాత్రమే కాకుండా, వాహనాలలోని ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలకు కూడా వర్తిస్తుంది. వాతావరణ మార్పు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, శీతలీకరణ పరికరాల వాడకం పెరుగుదలపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ చొరవ శక్తి సామర్థ్యాన్ని పెంచుతుందని, వేసవిలో విద్యుత్ డిమాండ్‌లో పెరుగుదలను తగ్గిస్తుందని, వినియోగదారులకు విద్యుత్ బిల్లులను తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version