Sarkar Live

ACB Raids | ఏసీబీ ఆకస్మిక దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో హడల్..

ACB Raids in Telangana | అవినీతి నిరోధ‌క శాఖ‌ లంచగొండి అధికారుల భ‌ర‌తం ప‌డుతోంది.. ప్ర‌తీరోజు బాధితుల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల‌తో ఆక‌స్మిక దాడులు చేస్తూ అవినీతి అధికారులకు ముచ్చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. తాజాగాఇంటి నంబర్‌ కోసం రూ. 5000 లంచం

ACB Raids
  • ఏసీబీ దాడుల్లో ఒకే రోజు ముగ్గురు లంచావతారుల అరెస్టు..
  • పెద్దపల్లిలో రూ.5వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన ముసిసిప‌ల్ ఉద్యోగులు

ACB Raids in Telangana | అవినీతి నిరోధ‌క శాఖ‌ లంచగొండి అధికారుల భ‌ర‌తం ప‌డుతోంది.. ప్ర‌తీరోజు బాధితుల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల‌తో ఆక‌స్మిక దాడులు చేస్తూ అవినీతి అధికారులకు ముచ్చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. తాజాగా
ఇంటి నంబర్‌ కోసం రూ. 5000 లంచం డిమాండ్‌ చేసి బాధితుడిని నుండి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఇద్దరు మున్సిపల్ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపిన వివ‌రాల ప్రకారం.. పెద్ద‌ప‌ల్లిలోని ద్వారకా నగర్ కు చెందిన ఎ.ప్రసాద్ అనే వ్యక్తి కొత్త‌గా నిర్మించుకున్న ఇంటి నెంబర్ కోసం మున్సిపల్ సిబ్బందిని ఆశ్రయించాడు. కాగా బాధితుడిని ఏడాది పాటు ఆర్‌ఐ వినోద్‌, బిల్‌ కలెక్టర్‌ నాంపల్లి విజయ్‌కుమార్‌ రూ.10వేల డబ్బులు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. దీంతో విసిగిపోయిన‌ బాధితుడు ప్రసాద్ చివరకు రూ.5వేలకు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు ఆక‌స్మిక త‌నిఖీలు చేసి ఆర్‌ఐ వినోద్‌, బిల్‌ కలెక్టర్‌ నాంపల్లి విజయ్‌కుమార్‌ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సోదాల్లో ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, సీఐలు కృష్ణ కుమార్, తిరుపతి, పూర్ణచందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

హుజూర్ న‌గ‌ర్‌లో ACB Raids .. ఒక‌రి అరెస్టు..

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ (ACB Raids in Huzurnagar ) లో ఏసీబీ అధికారులు ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టి లంచం తీసుకుంటున్న కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌ను ప‌ట్టుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. కరక్కాయల గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల పొలం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ప్రొసీడింగ్ పేపర్స్ కోసం శనివారం హుజూర్‌నగర్ ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లాడు. ఎమ్మార్వో ఆఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న విజేత రెడ్డి .. రూ.20 వేలు లంచం (Bribe) డిమాండ్ చేశాడు. చివరకు బాధితుడు రూ.12 వేలకు డీల్ కుదుర్చుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించ‌గా శనివారం పక్కా ప్లాన్‌తో బాధితులు ఎమ్మారో ఆఫీస్‌కు వొచ్చారు. కంప్యూటర్ ఆపరేటర్‌కు లంచం ఇస్తుండగా.. ఒక్కసాగా ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. లంచం తీసుకుంటున్న కంప్యూటర్ ఆపరేటర్‌ను పట్టుకున్నారు.

ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version