Sarkar Live

ACB Raids | బిల్లింగ్ అనుమతికి రూ.8 లక్షల డిమాండ్.. ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ అధికారి

అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విఠల్ రావును విచారిస్తున్న అధికారులు Hyderabad : జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు (ACB Raids) నిర్వహించారు. బిల్లింగ్ అనుమతి కోసం ఏకంగా రూ.8లక్షలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విట్టాల్ రావు

ACB Raids

అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విఠల్ రావును విచారిస్తున్న అధికారులు

Hyderabad : జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు (ACB Raids) నిర్వహించారు. బిల్లింగ్ అనుమతి కోసం ఏకంగా రూ.8లక్షలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విట్టాల్ రావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. విఠల్ రావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. విఠల్ రావుకు సంబంధించిన మూడు చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. రెండు బిల్డింగ్లకు ఎన్వోసీ ఇవ్వడానికి రూ.8 లక్షల డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.. రూ.4 లక్షలు తీసుకుని మరో రూ.4 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో సికింద్రాబాద్​ జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్​ ఆఫీసర్​ విఠల్ రావు.. రెండు బిల్డింగ్​ల నిర్మాణానికి ఎన్ఓసీ ఇవ్వడానికి రూ. 8 లక్షలు డిమాండ్​ చేశారు. మొదటి విడతలో 4లక్షలు తీసుకొని… మరో 4 లక్షల రూపాయలు ఇస్తేనే ఎన్ఓసి ఇస్తానని విఠల్ రావు చెప్పడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు దారుడు అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వలేని బతిమిలాడినా కూడా ​ విఠల్​ రావు ఎన్​ఓసీ ఇవ్వకపోవడంతో ఏసీబీ డీఎస్పీ శ్రీధర్​ కు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వలవేసి అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్​ ఆఫీసర్​ విఠల్ రావును పట్టుకున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version