Bhadradri Talambralu : భద్రాచలం శ్రీ సీతారామ కలాణోత్సవానికి (Sri Sitarama Kalyanotsavam) హిందూ ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏటా శ్రీ రామనవమి (Sri Rama Namavi) సందర్భంగా లక్షలాది మంది భక్తులు భద్రాచలం (Bhadrachalam) చేరుకుని స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొని పవిత్ర తలంబ్రాల (Bhadradri Talambralu)ను స్వీకరించడం ఆనవాయితీ. అయితే.. ఈ మహోత్సవానికి నేరుగా వెళ్లలేని భక్తుల కోసం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్వామి వారి తలంబ్రాలను హోం డెలవరీ చేసే సేవలను అందిస్తోంది.
ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్ బుకింగ్
గత సంవత్సరంలో ఈ సేవకు భక్తుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. దీంతో దీన్ని ఏడాది మరింత విస్తృతంగా అందించేందుకు టీజీ ఆర్టీసీ కార్యాచరణ రూపొందించింది. ఈసారి తలంబ్రాల (Bhadradri Talambralu) బుకింగ్ ప్రక్రియను ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ విధానంలో కూడా కొనసాగిస్తున్నారు. భక్తులు తమ సమీపంలోని టీజీ ఆర్టీసీ కార్గో పార్సెల్ కేంద్రంలో రూ.151 మాత్రమే చెల్లించి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారు tgsrtclogistics.co.in వెబ్సైట్లోనూ రిజిస్టర్ చేసుకోవచ్చు.
Bhadradri : ప్రారంభించిన ఆర్టీసీ ఎండీ
భద్రాచలం శ్రీ సీతారామ కల్యాణోత్సవం (Sri Sitarama Kalyanotsavam)లో ఉపయోగించే తలంబ్రాలు ఎంతో విశిష్టమైనవి. కల్యాణోత్సవ సమయంలో లక్షలాది తలంబ్రాలు ఉపయోగించబడతాయి. సాధారణంగా వీటిని ప్రత్యేక రంధ్రాల గరిటతో వడకట్టి శుద్ధి చేసి స్వామివారి కల్యాణానికి ఉపయోగిస్తారు. వాటినే భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. ఈ కల్యాణ మహోత్సవంలో నేరుగా పాల్గొనలేని భక్తులకు తలంబ్రాలను పంపించేందుకు టీజీ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టీజీ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ (TGSRTC Managing Director VC Sajjanar) ఈ ప్రత్యేక సేవను బస్ భవన్లో ప్రారంభించారు. భక్తులకు తలంబ్రాలను అందించే ప్రక్రియను స్వయంగా ప్రారంభిస్తూ తొలి బుకింగ్ను తనే స్వీకరించి రూ.151 చెల్లించి రశీదును పొందారు. ఈ కార్యక్రమంలో వ్యాపార విభాగం (లాజిస్టిక్స్) అధిపతి పి. సంతోష్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
అందుబాటులోకి కాల్ సెంటర్లు
భక్తులకు ఈ తలంబ్రాలను అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్గో పార్సెల్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. భక్తులు వీటిని తమ సమీపంలోని కేంద్రాల్లో బుక్ చేసుకోవచ్చు. అదనంగా, మరిన్ని వివరాల కోసం టీజీ ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ద్వారా ఫోన్ నంబర్లు 9177683134, 7382924900, 9154680020 సంప్రదించొచ్చు. అలాగే, టీజీ ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440069, 040-69440000 ద్వారా సమాచారాన్ని పొందొచ్చు. భద్రాచలం శ్రీ సీతారాముల పవిత్ర కల్యాణోత్సవ తలంబ్రాలను స్వయంగా వెళ్లి తీసుకోలేనివారికి ఇది ఒక గొప్ప అవకాశం. భక్తులందరూ ఈ ప్రత్యేక సేవను వినియోగించుకుని తమ ఇంటి వద్దనే స్వామివారి తలంబ్రాలను స్వీకరించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని టీజీ ఆర్టీసీ కోరుతోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..