RTC Strike | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె వాయిదా పడింది. మంగళవారం ఆర్టీసీ జేేఏసీ (RTC JAC) నేతలతో రాష్ట్ర ప్రభుత్వం జరిగిన చర్చలు సఫలమయ్యాయి.
రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ జెఎసి నాయకులతో చర్చలు జరిపారు. ఉద్యోగ సంఘాలు సమ్మెపై పునరాలోచించుకోవాలని ఆయన కోరారు. అంతకుముందు, టిజిఎస్ఆర్టిసి యాజమాన్యం ఉద్యోగులకు బహిరంగ లేఖను విడుదల చేసింది, సంస్థను కాపాడుకోవడానికి సహకారం అందించాలని కోరింది. ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందని పేర్కొంది. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ కార్పొరేషన్ ముందుకు సాగుతున్న తరణంలో సమ్మె చేయడం సరికాదని పేర్కొంది. టిజిఎస్ఆర్టిసిని సంక్షోభంలోకి నెట్టివేసిన 2019 సమ్మెను కూడా ప్రస్తావించింది.
RTC Strike : కార్మికుల సమస్యలపై కమిటీ
మంగళవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తో జేఏసీ నాయకులు చర్చలు జరిపారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం సమ్మతించడంతో సమ్మె వాయిదా (RTC Strike) వేస్తున్నట్టు మీడియాకు వెల్లడించారు. కాగా ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం ముగ్గురు సీనియర్ ఐఏఎస్లతో కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్ ఉన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.