Sarkar Live

Chhattisgarh | ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు మహిళ మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) లోని నారాయణ్‌పూర్ జిల్లాలోని అబుజ్‌మద్ (Abujhmad) ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఇద్దరు మహిళ మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు . సంఘటన స్థలం వద్ద

Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) లోని నారాయణ్‌పూర్ జిల్లాలోని అబుజ్‌మద్ (Abujhmad) ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఇద్దరు మహిళ మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు . సంఘటన స్థలం వద్ద 315 బోర్ రైఫిల్స్ తోపాటు ఇతర ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంఘటన కోకమెట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కోకమెట ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నారాయణపూర్ నుంచి డిఆర్జి, కొండగావ్ నుంచి ఎస్టీఎఫ్ సిబ్బందిని నక్సల్ ఆపరేషన్ కోసం పంపామని పోలీసులు వెల్లడించారు. బుధవారం రాత్రి పోలీస్ బలగాలు , మావోయిస్టులు సమావేశమైన ప్రదేశానికి చేరుకున్నప్పుడు, మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఉదయం బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినప్పుడు, ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version