Raithu Bhrosa | రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు వారి ఖాతాలలో జమచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రైతు భరోసాపై మంత్రివర్గ ఉప సంఘం వేశామని అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు.. వరికి రూ.500 బోనస్ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతోనే భోజనం అందించాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కేసీఆర్ హయాంలో తెలంగాణను అప్పుల కుప్పగా చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. ఈ ఏడాదిలోనే 20వేల కోట్ల రుణమాఫీ చేశామని.. ఇది దేశంలోనే చారిత్రాత్మకమని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ రూపంలో వచ్చే మారీచులను రైతులు నమ్మొద్దని అన్నారు. బీపీటీ, హెచ్ఎంటీ, తెలంగాణ సోనా వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తుందన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుజరాత్ గులాం అని, ఆయనకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలపై చర్చిద్దాం రావాలని సీఎం సవాల్ విసిరారు. రాష్ట్రంపై రూ.7 లక్షల కోట్లు అప్పు చేశారని ధ్వజమెత్తారు. ప్రతినెలా రూ. 6500 కోట్లు వడ్డీకే పోతోందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాదిగజారిందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్ హయాంలో అప్పుల గురించి దాచిపెట్టారని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గతంలో ఎవరూ బయటపెట్టలేదని అన్నారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ ఉద్ఘాటించారు. ప్రతిపక్షాల మాటలను నమ్మొదని అన్నారు. ఇచ్చిన గ్యారెంటీలను అధైర్యపడకుండా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులను రాజు చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకుసాగుతోందని తెలిపారు. మేం అధికారంలోకి రాగానే రూ. రూ. 7625 కోట్లు రైతుబంధు నిధులు ఇచ్చామని సీఎం గుర్తుచేశారు.
One thought on “Raithu Bhrosa | రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా”