Hyderabad Fish Prasadam 2025 : ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో లక్షలాది మంది పాల్గొనే చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలో సచివాలయంలో చేప ప్రసాదం పంపిణీపై బుధవారం సమీక్షా సమావేశంలో హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అధికారులకు కీలక సూచనలు చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులకు గతేడాది కంటే అదనంగా మరిన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈసారి చేప ప్రసాదం పంపిణీ కోసం 1.5 లక్షల చేప పిల్లలను సిద్దం చేసినట్లు మత్స్యశాఖ అధికారులు మంత్రికి తెలిపారు. చేప పిల్లల ఖర్చును నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ భరించాలని సూచించారు. క్యూ లైన్లలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, మహిళలకు వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వీఐపీ పాస్ లు పరిమితం చేయాలని చెప్పారు.
Fish Prasadam : జీహెచ్ఎంసీ సహకారం
చేప ప్రసాదం (Fish Prasadam) కోసం వచ్చే వారికి తాగునీటి సౌకర్యాలు , టాయిలెట్స్, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే భోజన సౌకర్యాలకు ఇబ్బందులు లేకుండా వారికి జీహెచ్ఎంసీ నుంచి సహకారం అందించాలన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకఱ్ చేప ప్రసాదం పంపిణీ పూర్తయ్యే వరకు జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది ఉండేలా చూడాలని, మొబైల్ టాయిలెట్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.