రూ. 1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా అరెస్టు
లంచం తీసుకుంటూ ఏఈ అవినీతి నిరోధక శాఖ (ACB )కి చిక్కారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్ విభాగం AE ) స్వరూపను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తాను చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని నగరానికి చెందిన కాంట్రాక్టర్ ఏఈ స్వరూపను కోరారు. అయితే బిల్లులు చెల్లించేందుకు ఏకంగా రూ.1.20 లక్షలు లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్ ను డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక సదరు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రంగారెడ్డి జిల్లా (Rangareddy District) ఏసీబీ యూనిట్ ఆధ్వర్యంలో పక్కా ప్లాన్ ప్రకారం బాధితుడి నుంచి ఏఈ స్వరూప లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏఈ స్వరూపను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో కూడా కాంట్రాక్టర్లను లంచాల పేరుతో ఇబ్బందులకు గురిచేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.
ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.