Hydra : హైడ్రా మరోమారు తన పవర్ చూపించింది. ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టడం లేదు. తాజాగా మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన కూల్చివేతల్లో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని స్వాధీనం చేసుకుంది. ఆయా స్థలాల్లో హెచ్చరిక బోర్డులను కూడా హైడ్రా పాతింది.
Hydra Action : వసంత ప్రాజెక్టు స్థలం స్వాధీనం
హైదరాబాద్ హఫీజ్ పేటలో గల 17 ఎకరాలను టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతొ అధికారులు రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను బల్డోజర్ తో తొలగించి బోర్డు పెట్టారు. ఈ 17 ఎకరాల భూమి విలువ సుమారు 2 వేల కోట్లకుపైగా ఉటుందని తెలుస్తోంది. అయితే 2005లోనే తాము ఈ భూమిని కొనుగోలు చేశామని, ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం హాఫీజ్ పేట సర్వేనెంబర్ 79/1 పూర్తి అక్రమమని తేల్చి చెప్పారు. ఆ భూమి మొత్తం ప్రభుత్వానిదేనని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. హైడ్రా విచారణలో అది ప్రభుత్వ భూమేనని తేలిందన్నారు.
ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్లోని రూ.3,900 కోట్ల ప్రభుత్వ భూమిని సైతం హైడ్రా కాపాడిది. జెఆర్సి కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని బహిరంగ స్థలంలో అకస్మాత్తుగా అక్కడ కంచెలు వేసేశారు. నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఓ బాలుడు హైడ్రాకు లేఖ రాశాడు. హైడ్రా కమిషనర్ ఎవి.రంగనాథ్ ఆ భూమి రికార్డులను పరిశీలించారు. మరోవైపు అక్కడ ప్లాట్ల కొనుగోలుకు సంప్రదించాల్సిన ఫోను నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేసింది నార్నే ఎస్టేట్స్ సంస్థ. అనుమతిలేని లే ఔట్తో రహదారులు నిర్మిస్తూ.. ప్లాట్లు అమ్మకాలు చేపట్టిన ఆక్రమణదారులు రెచ్చిపోయారు. హైడ్రా అధికారులు. ఆక్రమించుకున్న వారిపై కేసులు పెట్టారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
One thought on “Hydra : వేల కోట్ల ఆస్తులు కాపాడిన హైడ్రా”