Illegal immigrants in US : అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను గుర్తించి స్వదేశానికి పంపే ప్రక్రియను అక్కడి ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే 205 మంది భారతీయులను సీ-17 సైనిక విమానం ద్వారా భారత్కు పంపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) ప్రవేశపెట్టిన కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాల భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు. అమెరికాలో సుమారు 18 వేల మంది ఇండియన్స్ అక్రమంగా నివసిస్తున్నారని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. తమ సైనిక విమానాల ద్వారా వలసదారులను వారి స్వదేశాలకు పంపే విధానాన్ని ప్రారంభించింది. ఇలా అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో సురక్షితంగా పంపడం చరిత్రలోనే ఇది తొలిసారి అని ట్రంప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సహకరించాలని మోదీని కోరిన ట్రంప్
ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో ట్రంప్ ఇటీవల ఫోన్లో మాట్లాడారు. అమెరికా నుంచి అక్రమ వలసదారులను (Indian migrants) తిరిగి పంపే విషయంలో తమను సహకరించాలని కోరారు. సుమారు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారని ఆ దేశం గుర్తించింది. అయితే.. 2023-24 కాలంలో అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ శాఖ 1,100 కంటే ఎక్కువ భారతీయులను ఇప్పటికే స్వదేశానికి పంపింది. తాజాగా గ్లోబల్ 495 రిపాట్రియేషన్ ఫ్లైట్లు 1 లక్ష 60 వేల మందిని 145 దేశాలకు పంపగా అందులో భారత్ కూడా ఉంది.
అమెరికాలో Illegal immigrants
అమెరికాలో అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. 2023-24లో అక్కడి అధికారులు ఇలాంటి 90,415 కేసులను నమోదు చేశారు. అనుమతి లేకుండా అమెరికాలో ప్రవేశించడానికి చేసిన ప్రయత్నాలను అక్కడి అధికారులు బెడిసికొట్టారు.
వలసలకు కారణాలు ఏమిటంటే..
ముఖ్యంగా ఉత్తర సరిహద్దు ద్వారా భారతీయులు అనధికారిక ప్రవేశాల్లో సుమారు 3% ను కలిగి ఉన్నారు. ఇది ఫిలిపినో వంటి ఇతర ఆసియా సమూహాలను మించి ఉంది. భారతీయులు అక్రమ వలసకు ప్రయత్నించడానికి ప్రధాన కారణాలు ఆర్థిక సవాళ్లు, వీసా పరిమితులే అని తెలుస్తోంది. వీసా ఆలస్యం కూడా మరో సవాలుగా మారింది. అనేక భారతీయులు వీసాలు లేదా గ్రీన్ కార్డులు పొందడంలో పరిమితులు ఉండటంతో దీర్ఘకాలిక ఆలస్యాలను ఎదుర్కొంటున్నారు. ఇది కొందరిని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడానికి ప్రేరేపిస్తోంది.
విరివిగా సైనిక వనరుల వినియోగం
అమెరికా-మెక్సికో సరిహద్దులో అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య ( Illegal immigrants) పెరుగుతోంది. 2023-24లో అమెరికా అధికారులు 90,415 సార్లు భారతీయులు అనుమతి లేకుండా దేశంలోకి ప్రవేశించడానికి చేసిన ప్రయత్నాలను నమోదు చేశారు. ముఖ్యంగా ఉత్తర సరిహద్దు ద్వారా ఇప్పుడు భారతీయులు అనధికారిక ప్రవేశాలలో సుమారు 3% ను కలిగి ఉన్నారని తెలుస్తోంది. ఇది ఫిలిపినో వంటి ఇతర ఆసియా సమూహాలను మించి ఉంది. అక్రమ వలసదారులను స్వదేశానికి పంపే ప్రక్రియలో సైనిక వనరులను ఉపయోగించడం ఖరీదైంది. గతంలో గ్వాటిమాలాకు జరిగిన ఒక విమాన ప్రయాణం ప్రతి వలసదారుకు సుమారు 4,675 డాలర్లు ఖర్చు అయ్యింది. అయితే.. ట్రంప్ ప్రభుత్వం సరిహద్దు నియంత్రణను అమలు చేయడానికి సైనిక వనరులను ఎక్కువగా ఉపయోగిస్తోంది. భారతీయులను తిరిగి పంపడానికి సైనిక విమానాలను వినియోగిస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..