IMD Report | తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త తెలిపింది. ఈసారి కాస్త ముందస్తుగానే వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు అండమాన్లోకి ప్రవేశించినట్లు మంగళవారం మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతాన్ని తాకినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాల ఆగమనంతో గత రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
కాగా, రానున్న మూడు, నాలుగు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు రుతుపవనాలు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ (IMD ) వెల్లడించింది. మే 27వ తేదీ నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
IMD Report : జూన్ 12 నాటికి తెలంగాణకు రుతుపవనాలు
కాగా, సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి రుతుపవనాలు అండమాన్ ను తాకుతాయి. కానీ, ఈ సారి మాత్రం అంతకంటే ముందే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అలా, జరిగితే 2009 తర్వాత అంచనాల కంటే ముందే రుతుపవనాలు రావడం ఇదే మొదటిసారి అవుతుంది. అప్పుడు, మే 23వ తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ సారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం వుందని ఐఎండీ పేర్కొనింది. ఇక, జూన్ 12వ తేదీ వరకు తెలంగాణను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. తెలంగాణలో ఈ సారి సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరో వారం రోజుల్లో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం తగ్గనున్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.