కేసీఆర్ దేవుడని,కానీ ఆయనచుట్టూ దెయ్యాలున్నాయని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రెండు వారాల కిందట లేఖ రాసిన మాట వాస్తవమేనని ఆమె స్పష్టం చేశారు. లేఖ రాయడంలో వ్యక్తిగత ఏజెండా లేదని స్పష్టం చేశారు. అది పూర్తిగా వ్యక్తిగతమని అన్నారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలే చెప్పానని కవిత పేర్కొన్నారు. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో తెలియదని అన్నారు. అది పెద్ద కుట్ర అని.. పార్టీలో ఉన్న కోవర్టుల కారణంగానే బయటకు వచ్చిందని తెలిపారు.
కేసీఆర్కు తాను ఎప్పుడూ లేఖలు రాస్తూంటానన్నారు. పాజిటివ్, నెగటివ్ అంశాలపై తరచుగా లేఖలు రాస్తుంటానని కల్వకుంట్ల చెప్పారు. దాన్ని ఎవరూ బహిర్గతం చేశారో తెలియదని.. కేసీఆర్ కూతుర్ని నా లేఖకే ప్రైవసీ లేదని.. ఎవరు లీక్ చేశారనే విషయం బయటకు రావాల్సి ఉందన్నారు. నా లేఖను పట్టుకుని కాంగ్రేస్, బీజేపీ పండగ చేసుకుంటున్నాయని, మా నాయకుడు కేసీఆర్ – ఆయన నాయకత్వంలోనే బీఆర్ఎస్ బలంగా ముందుకెళ్తుందని తెలిపారు. కోవర్టులను పక్కకు జరుపుకొని ముందుకెళ్లాలని కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha ) సూచించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.