ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై పరోక్ష విమర్శలు
- రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు
- టిడిపిని బ్రష్టు పట్టించాడు.. కేసీఆర్, కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరాడని ఓ ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు
- పరకాలలో పోటీ చేసిన వ్యక్తి తన కాళ్ళు పట్టుకున్నాడని, ఈసారి తన కూతురు రాజకీయ అరంగ్రేటం చేయనుందని స్పష్టం చేసిన మాస్ లీడర్
సంచలనాలకు కేరాఫ్ అయిన కొండా మురళీ (Konda Murali) మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యే లపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇప్పుడు ఓరుగల్లు లో హాట్ టాపిక్ గా మారాయి.
వరంగల్ జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ (Rahul Ghandi) జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్టేషన్ ఘనపూర్, పరకాల ఎమ్మెల్యే లపై పరోక్షంగా ఘాటువ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ కాలం టిడిపి లో పదవులు అనుభవించి ఆ పార్టీని బ్రష్టుపట్టించాడని అనంతరం కేసీఆర్, కేటీఆర్ లను చెంతన చేరి వారిని వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిండు ఇక్కడేంచేస్తాడోనని పరోక్షంగా కడియం శ్రీహరి ని ఉద్దేశించి విమర్శలు చేశారని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు.
అంతేకాకుండా పరకాలలో పోటీ చేసిన వ్యక్తి తన కాళ్ళు పట్టుకున్నారని ఈ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వాలని వేడుకొన్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరిని ఉద్దేశించి పరోక్షంగా ఆయనపై కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. తన కూతురు సుస్మితా పటేల్ రాజకీయ రంగప్రవేశం చేయనుందని, పరకాలలో ఆమె పోటీచేస్తారని అన్నారు. మొత్తంగా సంచలనాలకు మారుపేరైన కొండా మురళీ చాలా కాలం తర్వాత ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం,అవి సోషల్ మీడియాలో వైరల్ కావడం ఉమ్మడి వరంగల్ జిల్లా లో హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
One thought on “Konda Murali | సంచలనం రేపుతున్న కొండా మురళి వ్యాఖ్యలు”