LRS Concession | లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (LRS) ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీ గడువును రాష్ట్ర సర్కారు మరోసారి పొడిగించింది. ఈనెల 3వ తేదీతో ముగిసిన గడువును మే 31 వరకు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్ టైమ్ సెటిల్మెంట్ ప్రకటించిన ప్రభుత్వం.. ఎల్ఆర్ఎస్పై రాయితీ గడువును తొలుత మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత దీనిని ఏప్రిల్ 30 వరకు, ఆ తర్వాత మే 3 వరకు పొడిగించింది. అయితే ఇప్పుడు మరోసారి మే 31వరకు రాయితీ అవకాశం కల్పించింది.
కాగా ఎల్ఆర్ ఎస్ రాయితీ (LRS concession) పొడిగింపునకు పలు కారణాలు చెబుతున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తడం, ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో రాయితీ గడువును పలుమార్లు పొడిగిస్తున్నట్టు పలువురు పేర్కొంటున్నారు. 2020లో ప్రారంభమైన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం కింద 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారిలో 40 శాతం మందికి అధికారులు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే 5.19 లక్షల మంది మాత్రమే ఏప్రిల్ 30 నాటికి చెల్లింపులు పూర్తి చేశారు. ఈ పథకం ద్వారా రూ.20,000 కోట్ల ఆదాయాన్ని ఆశించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటివరకు రూ.1,863 కోట్లు మాత్రమే సమకూర్చుకోగలిగింది. ఈ నేపథ్యంలో మరింత మంది దరఖాస్తుదారులకు అవకాశం కల్పించేందుకు గడువును జూన్ వరకు పొడిగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.