Sarkar Live

ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఎస్ఈ

Warangal News : మహబూబాబాద్ జిల్లా (Mahaboobabad District) కేంద్రంలో విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ నరేష్‌ను ఏసీబీ అధికారులు (ACB offiicals) అరెస్టు చేశారు. కురవి, మరిపెడ మండలాల్లో విద్యుత్ నిర్మాణ పనులను కొనసాగించేందుకు అనుమతి కోసం కాంట్రాక్ట‌ర్ నుంచి రూ.80

ACB

Warangal News : మహబూబాబాద్ జిల్లా (Mahaboobabad District) కేంద్రంలో విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ నరేష్‌ను ఏసీబీ అధికారులు (ACB offiicals) అరెస్టు చేశారు. కురవి, మరిపెడ మండలాల్లో విద్యుత్ నిర్మాణ పనులను కొనసాగించేందుకు అనుమతి కోసం కాంట్రాక్ట‌ర్ నుంచి రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా ఆయన‌ను అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నరేష్‌ను ఆయ‌న‌ ఇంట్లోనే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ చేపట్టారు.
స్థానిక హస్తినాపురం కాలనీలో విద్యుత్ అధికారి నరేష్ ఏసీబీ ట్రాప్ లో చిక్కుకున్నాడు. 80 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు నరేష్. దీంతో నరేష్ ఇంట్లో ఎసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ ను లంచం డిమాండ్ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు మేరకు నిఘా ఉంచి లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నారు. నరేష్ పట్టుబడటంతో అతడి ఇంట్లో కూడా ముమ్మ‌రంగా సోదాలు చేస్తున్నారు.

ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ అవినీతినిరోధక శాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలైన “వాట్సప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్ సైట్ (https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version