మాస్ మహారాజా రవితేజ (mass maharaj Ravi Teja)మరో కొత్త సినిమాను ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల తను తీసిన మూవీస్ అన్నీ కూడా వరుసగా ప్లాప్ అవుతూ వస్తున్నాయి. రవితేజ కెరీర్ లో ఇలా గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. తన మూవీ ఫ్లాప్ అయిన ప్రతిసారి ఒక భారీ హిట్ తో సమాధానం ఇస్తూనే ఉంటాడు. అభిమానులకు మన హిట్టు ఇవ్వాలనే కసితోనే ఉన్నాడు.
భారీ అంచనాలతో వచ్చిన ఈగల్(eagle)మూవీ దారుణ పరాజయాన్ని చవిచూడగా ఇక హిట్ గ్యారెంటీ అనుకున్న మిస్టర్ బచ్చన్(mister bachchan)కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మిరపకాయతో బంపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ (Harish Shankar)డైరెక్టర్ కావడంతో రవితేజ అభిమానులు ఆ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలను తలకిందులు చేస్తూ ఈ మూవీ ఏమాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది.
Ravi Teja షూటింగ్ చివరలో మాస్ జాతర..
ఇక ఆ మూవీ రిజల్ట్ కి డిసప్పాయింట్ కాకుండా తన ల్యాండ్ మార్క్ 75వ మూవీని మొదలెట్టాడు. కథ నచ్చితే కొత్త, పాత డైరెక్టర్ అని చూడడు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూటింగ్ మొదలు పెట్టేస్తాడు. అలా తన 75వ సినిమాను కొత్త డైరెక్టర్ చేతిలోనే పెట్టాడు. మాస్ జాతర (Mass jathara)అన్న టైటిల్తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఆ మధ్య రవితేజకు గాయం కావడంతో మూవీ టీం కొద్దిరోజుల పాటు బ్రేక్ ఇచ్చినా మళ్లీ షూటింగ్ మొదలెట్టి ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటుంది.
ఈ మూవీ సెట్స్ పై ఉండగానే మరో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈసారి కిషోర్ తిరుమల(kishore thirumala)తో చేతులు కలపబోతున్నట్లు ఫిలింనగర్ టాక్. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన నేను శైలజ మూవీతో డీసెంట్ హిట్ అందుకున్న కిషోర్ తిరుమల ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు.
కిషోర్ తిరుమల మార్క్ తో మూవీ..?
లాస్ట్ టైం శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే మూవీ చేసి ఫ్లాప్ మూట కట్టుకున్నాడు. కానీ అంతకుముందు సాయి ధరమ్ తేజ్ తో తీసిన చిత్రలహరి అనే మూవీ తో మంచి హిట్టే అందుకున్నాడు. అందులోని స్టోరీ, దానికి తగ్గట్టుగా కుదిరిన ఎమోషన్స్ ఆడియన్స్ ని కట్టిపడేశాయి. ఆ మూవీ హిట్టును మాత్రం కంటిన్యూ చేయలేకపోయాడు. రవితేజ హిట్టు ప్లాపులను పెద్దగా పట్టించుకోడు. కథ నచ్చితే డైరెక్టర్ ను ఓకే చేస్తాడు. కిషోర్ తిరుమల చెప్పిన స్టోరీ నచ్చి అవకాశం ఇచ్చాడట. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా స్టోరీ ఉంటుందని, కిషోర్ తిరుమల మార్క్ ఎమోషన్స్ మిస్ కాకుండా మంచి ఎంటర్టైనర్ తో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఏదేమైనా ఈ నయా కాంబోపై రవితేజ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఎందుకంటే కిషోర్ తిరుమల మూవీస్ ఆడియన్స్ కి సరిగ్గా కనెక్ట్ అయితే మాత్రం రవితేజ కెరియర్ లో నిలిచిపోయే మూవీగా నిలబడుతుంది అనడంలో సందేహం లేదు.ఈ మూవీపై అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లోనే రానున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.