Telangana Cabinet 2025 | తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు ( Portfolio Allocation)కేటాయించారు. కార్మిక, మైనింగ్ శాఖ మంత్రిగా గడ్డం వివేక్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా అడ్లూరు లక్ష్మణ్, క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్థకశాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వీరు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు సెక్రటేరియట్ చాంబర్లు సైతం ఇప్పటికే సిద్ధమయ్యాయి.
- వాకిటి శ్రీహరి : పశుసంవర్థక, స్పోర్ట్ అండ్ యువజన సర్వీసులు శాఖ
- గడ్డం వివేక్: కార్మిక, మైనింగ్ శాఖలు
- అడ్లూరి లక్ష్మణ్ : ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ
ఇక కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన ఈ ముగ్గురు మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచినవారే.. వివేక్ గతంలో ఎంపీగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక మక్తల్ నుంచి వాకిిటి శ్రీహరి, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాగా త్వరలోనే మంత్రివర్గంలోని మరో మూడు ఖాళీలను కూడా భర్తీ చేయనుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.