Morphed photos : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy Chief Minister Pawan Kalyan)పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మార్ఫింగ్ ఫొటో (Morphed photos)లపై జనసేన పార్టీ కార్యకర్తలు భగ్గమన్నారు. పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఈ ఫొటోలను మార్ఫింగ్ చేసి షేర్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.
మహాకుంభామేళాలో పుణ్యస్నానం.. Morphed photos
ప్రయాగరాజ్ మహా కుంభమేళా సందర్బంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. దీని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. అయితే.. కొందరు సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ చిత్రాలను మార్ఫింగ్ చేసి, ఆయనకు భారీ పొట్ట వచ్చిందని చూపిస్తూ వైరల్ చేశారు. దీంతో నెటిజన్లు బాడీ షేమింగ్ చేయడం మొదలెట్టారు. ఇది జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.
Morphed photosపై జనసేన కార్యకర్తల ఆగ్రహం
ఈ వివాదాస్పద మార్ఫింగ్ ఫొటోలపై జనసేన కార్యకర్తల (Jana Sena party workers) ఫిర్యాదు మేరకు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ, నరసరావుపేట పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కల్యాణ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి షేర్ చేసి ఆయన్ను కించపరుస్తున్న వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు భవిష్యత్తులో జరగకుండా కఠిన చట్టాలను ప్రయోగించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గుణరం మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఫొటోల మార్ఫింగ్పై ఇప్పటి వరకు తమ పోలీస్స్టేషన్లో నాలుగు కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ కేసులపై దర్యాప్తును ముమ్మరం చేశామని, ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..