G7 Summit | న్యూదిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. సైప్రస్, కెనడా(Canada), క్రొయేషియా దేశాలలో ఐదు రోజులపాటు పర్యటించనున్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది.
సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో ఈనెల 15, 16వ తేదీల్లో పర్యటించనున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత అక్కడ పర్యటించనున్న మొదటి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. కాగా ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకోవడం, మధ్యధరా ప్రాంతం, యూరోపియన్ యూనియన్లతో సంబంధాలను మరింత బలోపేతం చేసే విధంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి.
ఇక సైప్రస్ నుంచి ప్రధాని మోదీ కెనడాకు బయలుదేరివెళ్లనున్నారు. ఆ దేశ నూతన ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జూన్ 16-17న కననాస్కిస్లో జరగనున్న జీ-7 సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ ((PM Modi) పాల్గొనడం వరుసగా ఆరవసారి. కాగా జీ-7 సమ్మిట్ లో భాగంగా దేశాధినేతలతో మోదీ సమావేశం కానున్నారు. జీ-7 దేశాలలోని అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత, కీలక అంతర్జాతీయ సమస్యలు, సాంకేతికత, ఆవిష్కరణలు, ముఖ్యంగా ఏఐతో(AI) అనుసంధానం, క్వాంటమ్ సంబంధిత అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇక జూన్ 18న ప్రధాని నరేంద్ర మోదీ ఐరోపాలోని క్రొయేషియాకు వెళ్లనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.