అమరావతి : ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ (Quash petition) పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఏజీ వచ్చి వాదనలు వినిపిస్తారని, అందుకు తగిన సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఆర్జీవీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఒకే అంశంపై పలుచోట్ల కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
Pushpa -2 | పుష్ప – 2 ” రన్ టైమ్ మరీ ఓవర్..!!?
ఏపీ సీఎం నారా చంద్రబాబు (Chandra Babu), ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఫొటోలను మార్ఫింగ్ (Photos Marfing) చేసి సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టినందుకు గాను రాంగోపాల్ వర్మపై ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై పోలీసులు రెండుసార్లు నోటీసులు అందించినా కూడా వర్మ విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు హైదరాబాద్, తమిళనాడులో ఆయన కోసం గాలింపులు చేపట్టారు. ఇప్పటికే నాలుగు రోజులు కావస్తున్నా ఆర్జీవీ ఆచూకీ పోలీసులు గుర్తించలేకపోతున్నారు.