- అనుమతుల్లేని బ్రాంచీలపై చర్యలేవీ? అధికారులపై తీవ్ర ఆరోపణలు
- బ్రాంచీలను సీజ్ చేయకుండా ఉండేందుకు జిల్లా అధికారిని మచ్చిక చేసుకున్నట్లు ఆరోపణలు..?
డిఐఈఓ తెలిసే రెజోనెన్సు యాజమాన్యం అనుమతిలేకుండా బ్రాంచీలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం..? - హన్మకొండ డిఐఈఓ ఎలా స్పందిస్తారో ?
Hanamkonda News | తమకున్న పలుకుబడితో అనుమతి లేకుండా నగరంలో బ్రాంచీలు నిర్వహిస్తున్న రెజోనెన్సు (Resonance) యాజమాన్యం ఏకంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారినే తమ గుప్పిట్లో ఉంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చర్యలు తీసుకోవాలన్న.. అనుమతి లేని బ్రాంచీలను సీజ్ చేయాలన్న ఆ అధికారం డీఐఈవో (DIEO) కే ఉంటుంది కనుక ఆ అధికారినే వారు ప్రసన్నం చేసుకొని అనుమతి లేకుండా 5 బ్రాంచీలు నిర్వహిస్తూ ఐఐటీ(IIT), జేఈఈ(JEE), నీట్(NEET) పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

డీఐఈవోకు తెలుసా..?
హన్మకొండ నగరం (Hanamkonda City) లో కార్పొరేట్ విద్య పేరుతో నిబంధనలకు విరుద్ధంగా.. ఎలాంటి అనుమతి లేకుండా 5 బ్రాంచీ (Unauthorized Branches)లను రెజోనెన్సు యాజమాన్యం ఏర్పాటు చేసింది. జిల్లాలో ఉన్న ఇంటర్మీడియట్ కళాశాలలపై నిత్యం పర్యవేక్షణ చేసే అధికారికి అసలు అనుమతి లేకుండా రెజోనెన్సు యాజమాన్యం హన్మకొండ నగరంలో బ్రాంచీలు ఏర్పాటు చేసిన విషయం తెలుసా? తెలియదా? అనే ప్రశ్నలు ఓవైపు తలెత్తుతుండగా, మరోవైపు అంతా డీఐఈఓకు తెలిసే జరుగుతుందని, రెజోనెన్సు యాజమాన్యానికి ఆ అధికారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా అనుమతి లేకుండా నడుస్తున్న 5 బ్రాంచీలను హన్మకొండ డీఐఈఓ (Hanamkonda DIEO) సీజ్ చేస్తారా? లేదా ప్రచారం జరుగుతున్నట్లు యాజమాన్యానికి సహకరిస్తూ గమ్మునుంటారా అనేది తేలిపోనుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
One thought on “Hanamkonda | రెజోనెన్సు గుప్పిట్లో డీఐఈఓ..?”