Special Trains | తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామేశ్వరం వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Cheralapalli) నుంచి రామనాథపురం (Ramanathapuram) వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. చర్లపల్లి-రామనాథపురం (07695) రైలు ఈనెల 11 నుంచి 25 వరకు ప్రతీ బుధవారం రాకపోకలు ప్రయాణికులకు సేవలందిస్తుందిన పేర్కొంది. అలాగే, రామనాథపురం నుంచి చర్లపల్లి (07696) రైలు ఈ నెల 13 నుంచి 27 వరకు ప్రతీ శుక్రవారం ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
SCR Special Trains హాల్టింగ్ స్టేషన్లు ఙవే..
ఈ ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, చెన్నై ఎగ్మోర్, చెంగల్పట్టు, విల్లుపురం, చిదంబరం, సిర్కాజీ, మయిలదుతురై, తిరువూర్, తిరుతురైపూండి, అదిరంపట్టణం, పుదుకొట్టై, అర్ణతాంగి, కారైకుడి, శివగంగ, మానమాదురై స్టేషన్లలో రైలు ఆగుతుందని పేర్కొంది.
ఈ రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉన్నాయని రైల్వేశాఖ వివరించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.