Sarkar Live

Secunderabad station | సికింద్రాబాద్ స్టేష‌న్‌కు వెళ్తున్నారా.. ఇది పాటించండి

Secunderabad Railway station : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునికీక‌ర‌ణ ప‌నులు సాగుతున్నాయి. ప్ర‌యాణికుల‌కు స‌రికొత్త హంగుల‌తో మ‌రిన్ని సౌక‌ర్యాల‌ను పెంచేందుకు పున‌ర్నిర్మాణం సాగుతోంది. ఈ ప‌నుల నేప‌థ్యంలో ప్ర‌యాణికుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా రైల్వే శాఖ (South Central Railway-SCR) ప‌లు

Secunderabad station

Secunderabad Railway station : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునికీక‌ర‌ణ ప‌నులు సాగుతున్నాయి. ప్ర‌యాణికుల‌కు స‌రికొత్త హంగుల‌తో మ‌రిన్ని సౌక‌ర్యాల‌ను పెంచేందుకు పున‌ర్నిర్మాణం సాగుతోంది. ఈ ప‌నుల నేప‌థ్యంలో ప్ర‌యాణికుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా రైల్వే శాఖ (South Central Railway-SCR) ప‌లు చ‌ర్య‌లు చేప‌డుతోంది. ముఖ్యంగా ప్ర‌యాణికులు స్టేష‌న్ (Secunderabad station) లోప‌లికి వెళ్లడానికి, బ‌య‌ట‌కు రావ‌డానికి ఉన్న మార్గాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

Secunderabad station | కొత్త మార్గాలు ఇవే..

  • ఫ్లాట్‌ఫామ్‌ నంబర్‌ 1: గణేష్‌ ఆలయం పక్కన గేట్‌ నంబర్‌ 2 వద్ద కొత్త ప్రవేశ ద్వారం ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణికులు స్టేషన్‌లోకి సులభంగా ప్రవేశించేందుకు సహాయపడుతుంది.
  • గేట్‌ నంబర్‌ 4: ఈ గేటును మూసివేశారు. స్వాతి హోటల్‌ ఎదురుగా గేటు నంబర్ 3తోపాటు 3బీ అనే అదనపు ప్రవేశద్వారాలను ఏర్పాటు చేశారు. ఇవి ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌ 10కు చేరుకోవడానికి ఉపయోగపడతాయి.
  • ప్లాట్‌ఫామ్‌ నంబర్‌ 10: బోయిగూడ వైపు గేటు నంబర్‌ 8 వద్ద టికెట్‌ కౌంటర్‌తో పాటు కొత్త ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఈ ప్రాంతం నుండి స్టేషన్‌లోకి ప్రవేశించేందుకు ఇది సౌకర్యంగా ఉంటుంది. ప్రయాణికులకు సౌకర్యాలు
  • వెయిటింగ్‌ హాల్‌: 750 మంది ప్రయాణికులు (passengers) ఒకేసారి ఉండగలిగే విధంగా కొత్త వెయిటింగ్‌ హాల్‌ను ఏర్పాటు చేశారు. ఇది టికెట్‌, విచారణ కౌంటర్లకు సమీపంలో ఉంది.
  • సైన్‌ బోర్డులు: స్టేషన్‌లో ఎంట్రీ/ఎగ్జిట్‌ మార్గాలు, ప్లాట్‌ఫారాలను గుర్తించేందుకు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలపై సైన్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇవి ప్రయాణికులు సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి దోహదపడతాయి.
  • ప్లాట్‌ఫారమ్‌ సమాచారం: రైళ్లు వచ్చే ప్లాట్‌ఫారాల వివరాలను ముందుగానే ప్లాట్‌ఫామ్ 1, 10లో ప్రదర్శిస్తున్నారు. ఇది ప్రయాణికులు తమ రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవడానికి సహాయపడుతుంది. అభివృద్ధి పనుల ప్రాముఖ్యత సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ 151 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. 1874లో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీ ఖాన్‌ ఈ స్టేషన్‌ను నిర్మించారు. అప్పటి నుంచి అనేక మార్పులు, అభివృద్ధికి ఇది నోచుకొంది. ప్రస్తుతం అమృత్‌ భారత్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ స్టేషన్‌ను ఆధునికీకరిస్తోంది. ఇందుకు రూ.720 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తున్నారు. ఈ ఆధునికీకరణలో భాగంగా స్టేషన్‌ భవన నమూనా, స్కై కాన్‌కోర్స్‌, ట్రావెటర్స్‌, లిఫ్ట్స్‌, ఎస్కలేటర్స్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా అనేక దశల అండర్‌గ్రౌండ్‌ పార్కింగ్‌ ప్లేస్‌, షాపింగ్‌ మాల్స్‌, కెఫేలు వంటి సదుపాయాలు కూడా ప్రయాణికుల కోసం అందుబాటులోకి రానున్నాయి. ఈ అభివృద్ధి పనులు 2026 నాటికి పూర్తవుతాయని కేంద్ర రైల్వే సహాయ మంత్రి రన్వీత్‌ సింగ్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రపంచ స్థాయి సదుపాయాలతో ప్రయాణికులకు సేవలు అందించనుందని ఆయ‌న అన్నారు.

Secunderabad station ఆధునికీకరణ పనుల గురించి ప్రయాణికులకు స‌మాచారం ఇచ్చి త‌ద్వారా వారికి ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా రైల్వే శాఖ చ‌ర్య‌లు చేపట్టింది. స్టేషన్‌లో జరుగుతున్న మార్పుల గురించి తెలుసుకోవడం, సంబంధిత మార్గదర్శకాలను పాటించడం ప్ర‌యాణికుల‌కు అవసరమ‌ని పేర్కొంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version