Sarkar Live

Bharat Gaurav Tourist Train : భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. మహా శివరాత్రి కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ

Bharat Gaurav Tourist Train | ఈనెల 26న మహా శివరాత్రి ప‌ర్వ‌దినాన్ని పుస్క‌రంచుకొని దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. భక్తుల కోసం ఇండియన్‌ ‌రైల్వే క్యాటరింగ్‌ అం‌డ్‌ ‌టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక‌ ప్యాకేజీని ప్రకటించింది. రామ జ‌న్మ‌భూమి

Bharat Gaurav Tourist Train

Bharat Gaurav Tourist Train | ఈనెల 26న మహా శివరాత్రి ప‌ర్వ‌దినాన్ని పుస్క‌రంచుకొని దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. భక్తుల కోసం ఇండియన్‌ ‌రైల్వే క్యాటరింగ్‌ అం‌డ్‌ ‌టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక‌ ప్యాకేజీని ప్రకటించింది. రామ జ‌న్మ‌భూమి అయోధ్య- కాశీ పుణ్యక్షేత్ర యాత్ర, జ్యోతిర్లింగ దర్శనం ప్యాకేజీని ప్ర‌వేశ‌పెట్టింది .భారత్‌ ‌గౌరవ్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌ద్వారా భ‌క్తులు ఈ పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు.

Bharat Gaurav Tourist Train : ప్యాకేజీ వివ‌రాలు ఇవీ..

అయోధ్య- కాశీ పుణ్యక్షేత్ర యాత్ర, జ్యోతిర్లింగ దర్శనం యాత్ర‌ ఎనిమిది రాత్రులు/తొమ్మిది పగళ్లు సాగుతుంది. ఈ నెల 28వ తేదీన సికింద్రాబాద్ స్టేష‌న్ నుంచి ‌భారత్‌ ‌గౌరవ్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌బయలుదేరుతుంది. ఈ రైలులో మొత్తం 718 సీట్లు ఉంటాయి. ఇందులో స్లీపర్‌- 460, 3ఏసీ- 206, 2ఏసీ- 52
హాల్టింగ్ స్టేష‌న్లు సికింద్రాబాద్‌ ‌నుంచి బయలుదేరి కాజీపేట‌, ‌వరంగల్‌, ‌ఖమ్మం, ఏపీలోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పలాస, ఒడిశాలోని బ్రహ్మపూర్‌, ‌ఖుర్దారోడ్‌, ‌భవనేశ్వర్‌, ‌కటక్‌, ‌భద్రక్‌, ‌బాలేశ్వర్‌ ‌స్టేషన్‌లల్లో ఈ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ ‌సౌకర్యం ఉంది.

ఈ ప్యాకేజీలో గయ- వారణాశి- అయోధ్య- ప్రయాగ్‌ ‌రాజ్‌ ఉన్నాయి. గయలో విష్ణుపాద ఆలయం, వారణాశిలో కాశీ విశ్వనాథ ఆల‌యం, అక్కడి కారిడార్‌, ‌కాశీ విశాలాక్షి ఆల‌యం, అన్నపూర్ణ దేవి దేవాలయాలను భ‌క్తులు సందర్శించవచ్చు. అయోధ్యలో ప్ర‌సిద్ధ బాల‌రాముడి ఆలయం, హనుమాన్‌ ‌గర్హి, హారతి, అత్యంత ప్రాచీనమైన సరయూ నదిని కూడా సంద‌ర్శించ‌వ‌చ్చు. ఇక ప్రయాగ్‌ ‌రాజ్‌లో కుంభ‌మేళా సంద‌ర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించడంతో ఈ ప్యాకేజీ టూర్‌ ‌ముగుస్తుంది.

తిరుగు ప్ర‌యాణంలో..

ప్రయాగ్‌ ‌రాజ్‌ ‌నుంచి మళ్లీ సికింద్రాబాద్‌కు భార‌త్ గౌర‌వ్ ఎక్స్ ప్రెస్‌ రైలు చేరుకుంటుంది. IRCTC ‌ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం రూ.14,390. ఇది ఎకానమీ అంటే స్లీపర్‌ ‌క్లాస్‌. ఇం‌దులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి రూ.13,495 ఛార్జీని నిర్ణ‌యించారు. థర్డ్ ఏసీలో పెద్దలకు రూ.23,600, పిల్లలకు రూ.22,550, సెకెండ్‌ ఏసీ పెద్దలకు రూ.31,160, పిల్లలకు రూ.29,990 చెల్లించాల్సి ఉంటుంది.

దేశంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ భార‌తీయ‌ రైల్వే.. భారత్‌ ‌గౌరవ్ ఎక్స్ ప్రెస్‌ ‌పేరు (Bharat Gaurav Tourist Train )తో ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. వీటికి దేశ‌వ్యాప్తంగా ప్రయాణికుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ప్రారంభమైన అన్ని చోట్ల కూడా ప్రయాణికుల ఆదరణ భారీగా ఉంటోంది. అందుకే త‌ర‌చూ వీటి ట్రిప్‌ల సంఖ్యను రైల్వేశాఖ‌ పెంచుతోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version