Sarkar Live

Kancha gachibowli issue | కంచ గచ్చిబౌలి ఘ‌ట‌న‌పై సుప్రీం సీరియ‌స్

Kancha Gachibowli issue : హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli)లో భారీ స్థాయిలో చెట్లు నరికివేత‌పై సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. చెట్ల‌ను ఎందుకు న‌ర‌కాల్సి (tree felling) వ‌చ్చింద‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై అస‌హ‌నం

Kancha Gachibowli issue

Kancha Gachibowli issue : హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli)లో భారీ స్థాయిలో చెట్లు నరికివేత‌పై సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. చెట్ల‌ను ఎందుకు న‌ర‌కాల్సి (tree felling) వ‌చ్చింద‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. చెట్లు నరికిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని తేల్చి చెప్పింది.

ఎవ‌రిని అడిగి అడ‌విని న‌రిశారు?

కంచ గచ్చిబౌలి భూ వివాదం కేసును సుప్రీం కోర్టు సుమోటో (Suo Motu)గా తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తుల బృందం అయిన జస్టిస్ బి.ఆర్. గవాయ్ (Justice B.R. Gavai), జస్టిస్ ఎ.జి. మసీహ్ (Justice A.G. Masih) ఈ కేసు విచారణ చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ తరపున తమిళనాడుకు చెందిన సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింగ్‌వి (Abhishek Manu Singhvi) వాదించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కంచ గ‌చ్చిబౌలి భూమిలో అభివృద్ధి ప‌నుల‌ను తాత్కాలికంగా ఆపేశారని కోర్టుకు తెలిపారు. దీనిపై న్యాయమూర్తి గవాయ్ స్పందిస్తూ “మీరు చెట్లు నరికేందుకు ఫారెస్ట్ శాఖ అనుమతులు తీసుకున్నారా?” అని ప్ర‌శ్నించారు. అదే సమయంలో మరో సీనియర్ అడ్వొకేట్ పర్మేశ్వర్ (Parmeswar) కౌంటర్ వాదనలు చేస్తూ ‘ప్రభుత్వం Self-Certification’ అనే విధానాన్ని అనుసరించి కొన్ని చెట్లను నరకడానికి unilateral exemption ఇచ్చింది’ అని ఆరోపించారు.

Kancha Gachibowli issue : వ‌న్య‌ప్రాణుల‌ పరిస్థితిపై ఆందోళన

సుప్రీం కోర్టు అడవి ప్రాంతంలో ఉన్న జంతువుల పరిస్థితిపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలను ప్రస్తావిస్తూ ‘చెట్లు నరికినప్పుడు జంతువులు తప్పించుకునేందుకు పరుగులు తీస్తుండగా వీధి కుక్కలు వాటిని కరుస్తున్నాయ్’ అని పేర్కొంది.

హాలీడే రోజుల్లోనే బుల్డోజర్లు ఎందుకు?

కోర్టు ముఖ్యంగా ఓ అంశంపై కఠినంగా మాట్లాడింది. రెండు మూడు రోజుల సెలవుల రోజుల్లో వందెకరాల అడవిని బోల్డోజ‌ర్ ద్వారా తుడిచి పెట్టేశారు. అంత అర్జెంట్ ఎందుకు ?’ అని ప్ర‌శ్నించింది.
నిర్మాణాలు చేయాలంటే ముందు అనుమతులు తీసుకోవాలి. పర్యావర ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో దీనికి మేం మినహాయింపులు ఇవ్వం. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రాజెక్టుల కోసం ఈ కోర్టులో పోరాడాల్సి వచ్చింది’ అని న్యాయమూర్తి గవాయ్ వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు 1996లో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ప్రైవేట్ భూముల్లోనైనా చెట్లు నరికితే అదీ చట్టవిరుద్ధమ‌ని గుర్తుచేసింది. ప్రభుత్వం, అధికారులు లేదా మంత్రుల అభిప్రాయాలను పరిగణన‌లోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.

పునరుద్ధరణ రిపోర్టు ఇవ్వాల్సిందే..

రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి (Chief Secretary) సుప్రీం కోర్టు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ‘ మీరు కనీసం పునరుద్ధరణ ప్రణాళికను (Restoration Plan) ఇవ్వకపోతే మీ అధికారులలో ఎంత మందిని తాత్కాలికంగా జైలుకు పంపాలో మాకు తెలుసు’ అని వ్యాఖ్యానించింది.. పర్యావరణాన్ని కాపాడటం కోసం ఏమైనా చేయగలుగుతామ‌మ‌ని అంది.

CEC నివేదిక‌పై స్పందించిన కోర్టు

సెంట్ర‌ల్ ఎంవ‌ర్డ్ క‌మిటీ (CEC) సమర్పించిన నివేదికపై కూడా కోర్టు స్పందించింది. ఆ నివేదికలో కంచ‌చ గచ్చిబౌలి భూమిని ప్రభుత్వ అధికారులే ఖాతాదారులకు mortgage చేశారని, కానీ ఆ అంశాన్ని అఫిడవిట్లలో (affidavits) ప్రకటించలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై కోర్టు నాలుగు రోజుల్లో స‌మాధానం ఇవ్వాల‌ని ఆదేశించింది. తదుపరి విచారణ మే 15న జరగనుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version