Surveyor Jobs in Telangana | రాష్ట్రంలోని నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అతిత్వరలో లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం వెల్లడించారు. తొలివిడతలో 5000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించునున్నామని ఆయన తెలిపారు. నక్షా లేని గ్రామాలు, లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణపై గురువారం మంత్రి పొంగులేటి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Surveyor : 26 నుంచి రెండు నెలలపాటు శిక్షణ
కొత్త సర్వేయర్ల (Surveyor )కు ఈనెల 26న సోమవారం నుంచి రెండు నెలల పాటు ఆయా జిల్లా కేంద్రాల్లోనే శిక్షణ ఇప్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దరఖాస్తుదారులు సోమవారం వారివారి జిల్లా సర్వే అధికారులను సంప్రదించాలని మంత్రి సూచించారు. మంత్రి పొంగులేటి చెప్పిన వివరాలను బట్టి శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లు వెంటనే ఆయా మండలాల్లో భూవిస్తీర్ణం, భూ లావాదేవీలను బట్టి ఆరు నుంచి ఎనిమిది మంది సర్వేయర్లను నియమించనున్నారు.
రాబోయే రోజుల్లో ప్రతిగ్రామంలో మండలంలో రెవెన్యూ డివిజన్లో పట్టణ ప్రాంతాల్లో భూములకు సంబంధించిన అనేక పంచాయితీల్లో ఈ సర్వేయర్ల ద్వారా శాశ్వత భూ పరిష్కారం లభిస్తుంది. రిజిస్ట్రేషన్ సమయంలో తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ వద్ద భూములకు సంబంధించిన డాక్యుమెంట్లతోపాటు సర్వే పత్రాన్ని కూడా జత పరచాలని భూభారతి చట్టంలో పేర్కొంది. ఇందుకు అనుగుణంగానే సర్వే విభాగాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.