తెలంగాణ ప్రభుత్వ (Telangana government) పాఠశాలల్లో చదివే ఆరో తరగతి, ఏడో తరగతి బాలురకు ఇకపై షార్ట్స్ (నిక్కర్లు) బదులుగా ప్యాంట్లు (pants) అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల అభ్యర్థనలు, ఉపాధ్యాయ సంఘాల సూచనల మేరకు ఈ మార్పును చేపట్టారు.
ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానం
ఇప్పటి వరకు ఏడో తరగతి వరకు చదివే బాలురకు షార్ట్స్ (shorts), ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్యాంట్లు అందించేవారు. అయితే.. ఆరు, ఏడో తరగతి విద్యార్థులు (students) కూడా ప్యాంట్లు ఇవ్వాలని విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు అభ్యర్థించారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఆరు, ఏడో తరగతి విద్యార్థులకు నిక్కర్ల బదులు, ప్యాంట్లు అందించాలని నిర్ణయించింది.
Replace School uniform : ప్రతి విద్యార్థికీ రెండు ప్యాంట్లు
ప్రతి ఏడాది ప్రభుత్వం (government) విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్లు ఉచితంగా అందిస్తోంది. ఇప్పటి వరకు ఆరు, ఏడో తరగతిలో విద్యార్థులు షార్ట్స్ (నిక్కర్లు) మాత్రమే ధరించాల్సి వచ్చేది. అయితే, కొత్త విద్యా సంవత్సరం నుంచి వారికీ షార్ట్స్ బదులు రెండు జతల ప్యాంట్లు (pants) అందించనున్నారు. ఈ మార్పు వల్ల విద్యార్థులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. ప్యాంట్లు ధరిస్తే మరింత ఆత్మవిశ్వాసంతో పాఠశాలకు హాజరవ్వవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, గిరిజన గురుకులాలు, ఇతర సహాయ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఈ యూనిఫామ్ను అందజేస్తుంది.
School uniform : స్వాగతిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు
ఈ మార్పును 2025-26 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు (students) దీంతో లబ్ధి పొందనున్నారు. ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం విద్యా విధానంలో మరో ముందడుగు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..