జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న ‘ఒసాకా ఎక్స్పో’ (Osaka Expo 2025) లో తెలంగాణ రాష్ట్రం తన పెవిలియన్ను సోమవారం ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భారత పెవిలియన్లో అడుగుపెట్టింది. భారత పెవిలియన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
Osaka Expo 2025 : తొలి రాష్ట్రంగా తెలంగాణ
భారత్ పెవిలియన్లోకి ప్రవేశించి తెలంగాణ జోన్ను ఆవిష్కరించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి జపాన్ (Japan) లేదా ఎక్స్పోను సందర్శించడం ఇదే మొదటిసారి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ (Telangana), ఒసాకా ఎక్స్పోలో పాల్గొన్న తొలి భారతీయ రాష్ట్రం కూడా. ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ ఎక్స్పోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులకు రాష్ట్రం తన వ్యాపార, కళలు, సాంస్కృతిక, పర్యాటక ప్రగతిని ప్రదర్శిస్తుంది.
కిటాక్యూషు నగరాన్ని సందర్శించిన సీఎం రేవంత్
ఒకప్పుడు కాలుష్యం పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులతో అతలాకుతలమై ఇప్పుడు ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా నిలిచిన కిటాక్యూషు నగరాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ నగరంలో పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని నగర మేయర్ కజుహిసా టెక్యూచి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… సుస్థిరత ఇకపై ఐచ్ఛికం కాదు అవసరమని పేర్కన్నారు. ఉపాధి కల్పన, అభివృద్ధి, సంపద సృష్టితో పాటు పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్ (Hyderabad) లో ఎకో టౌన్ అభివృద్ధి చేయటం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమై పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తామని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.