Sarkar Live

2024 Telecom Industry | టెలికాం ఆదాయం రెట్టింపు.. ఐదేళ్ల‌ల్లో గ‌ణ‌నీయ వృద్ధి

Telecom News | భారత టెలికాం (Indian telecom industry) ఆదాయం గ‌ణీయంగా పెరిగింది. FY25 రెండో త్రైమాసికంలో 8 శాతం (త్రైమాసికం వారీగా) పెరిగి రూ.674 బిలియన్ (ఏటా 13 శాతం వృద్ధి) చేరింది. ఇది ప్రధానంగా టారిఫ్ పెంపుల

Telecom Industry

Telecom News | భారత టెలికాం (Indian telecom industry) ఆదాయం గ‌ణీయంగా పెరిగింది. FY25 రెండో త్రైమాసికంలో 8 శాతం (త్రైమాసికం వారీగా) పెరిగి రూ.674 బిలియన్ (ఏటా 13 శాతం వృద్ధి) చేరింది. ఇది ప్రధానంగా టారిఫ్ పెంపుల వల్ల సాధ్య‌మైంద‌ని వెల్ల‌డైంది. మొబైల్ నెట్‌వర్క్‌ల‌ టారిఫ్‌లు విడత‌లుగా పెరగ‌డంతో దీంతో భారత టెలికాం త్రైమాసిక ఆదాయం సెప్టెంబర్ 2019 నుంచి ఇప్పటి వరకు 96 శాతం వృద్ధి చెందింది. అంటే.. ఐదేళ్ల వార్షిక వృద్ధి రేటు (CAGR) 14 శాతానికి చేరింది. మోతిలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ చేప‌ట్టిన స‌ర్వేలో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.

Telecom Industry రెండింత‌ల వృద్ధి

భారత టెలికాం పరిశ్రమలో సాంకేతికంగా సమీకృత మార్కెట్ నిర్మాణం, అధిక డేటా వినియోగం, తక్కువ ARPU (ప్రతి యూనిట్ ఆదాయం), టెలికాం కంపెనీలు తగినంత రాబడి పొందలేకపోవడం వంటి ప‌రిణామాల దృష్ట్యా టారిఫ్ (tariff)లు పెరిగాయ‌ని మోతిలాల్ ఒస్వాల్ సంస్థ తెలిపింది. టెలికాం పరిశ్రమ సగటు ARPU సెప్టెంబరు 2019లో రూ.98 నుంచి సెప్టెంబరు 2024లో రూ.193కి దాదాపు రెండింతలు పెరిగింద‌ని వెల్ల‌డించింది. టారిఫ్ పెంపుల వల్ల ఈ వృద్ధి సాధ్యమైంద‌ని పేర్కొంది.

అగ్ర‌స్థానంలో భార‌తి ఎయిర్‌టెల్‌

టెలికాం కంపెనీల్లో భారతి ఎయిర్‌టెల్ (Bharti Airtel)టారిఫ్ పెంపులతో గరిష్ట లాభం గ‌డించింది. ARPUలో 2.2 రెట్లు వృద్ధిని సాధించింది. ఐదేళ్లలో 17 శాతం CAGRను నమోదు చేసుకుంది. డేటా వినియోగదారుల సంఖ్య పెర‌గ‌డంతో భారతి పరిశ్రమ అగ్రస్థానంలో ఉంద‌ని నివేదిక చెబుతోంది. 2019-2024 కాలంలో భారతి ఆదాయం 2.6 రెట్లు పెరిగి, ఐదేళ్ల 21 శాతం ఆదాయం CAGRను సూచించింది. అదనపు ఆదాయ మార్కెట్ వాటా 48 శాతం అధికంగా ఉంది. పెట్టుబ‌డుల ప్రణాళిక‌ల దృష్ట్యా వోడాఫోన్ ఐడియా (Vi) మార్కెట్ వాటా పెరుగుదల మంద‌గించింద‌ని తెలుస్తోంది.

1.15 ట్రిలియన్ వినియోగ‌దారులు

ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం మార్కెట్ల‌లో భారత టెలికాం ఒక‌టి. 2024 నాటికి దేశంలో 1.15 ట్రిలియన్ మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మొబైల్ ఫోన్ వినియోగదారులే. భారత టెలికాంలో ప్రాథమికంగా జియో, భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి కొన్ని ప్రధాన కంపెనీల ఆధిపత్యంలో ఉన్నాయి.

టారిఫ్‌లు పెర‌గ‌డం వ‌ల్లే..

ఇటీవ‌ల టారిఫ్ పెంపులు, డిజిటలైజేషన్, డేటా వినియోగం పెరగడం వంటి అంశాలు పరిశ్రమ వృద్ధికి తోడ్పాటును అందించాయ‌ని తెలుస్తోంది. సెప్టంబ‌రు 2019 నుంచి సెప్టెంబరు 2024 వరకు ప్రతి యూనిట్ సగటు ఆదాయం (ARPU) రూ. 98 నుంచి రూ. 193కి పెరిగింది. ఇది టెలికాం కంపెనీల ఆదాయ వృద్ధికి సహాయపడింది.

మ‌ద్ద‌తుగా నిలిచిన డిజిట‌ల్ ఇండియా

5జీ సేవల ప్రారంభంతో భారత టెలికాం పరిశ్రమలో భారీ మార్పు చోటుచేసుకుంది. వడివడిగా పెరుగుతున్న డేటా వినియోగం, కొత్త సాంకేతికతలతో 5జీ సేవలు దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన దారులు తెరవవచ్చు. అలాగే, డిజిటల్ ఇండియా (Digital India ) ప్రాజెక్ట్ వంటి ప్రభుత్వ ప్రయత్నాలు టెలికాం రంగానికి మద్దతుగా నిలిచాయి. త‌ద్వారా టెక్నాలజీ ఆధారిత భవిష్యత్తు దిశ‌గా మ‌న భార‌త‌దేశం వేగంగా ప‌య‌నిస్తోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version