Sarkar Live

ఏపీలో TG EAPCET సెంట‌ర్లు ఇక ఉండ‌వు… ర‌ద్దు చేసిన JNTU

TG EAPCET 2025 : తెలంగాణ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET)కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈసారి ప‌రీక్ష కేంద్రాలు ఉండ‌వు. వాటిని ర‌ద్దు చేస్తున్న‌ట్టు హైద‌రాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) ప్ర‌క‌టించింది. తెలంగాణ ప్ర‌భుత్వం

Intermediate Results

TG EAPCET 2025 : తెలంగాణ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET)కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈసారి ప‌రీక్ష కేంద్రాలు ఉండ‌వు. వాటిని ర‌ద్దు చేస్తున్న‌ట్టు హైద‌రాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) ప్ర‌క‌టించింది. తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం మేర‌కు ఈ ప‌రీక్ష కేంద్రాల‌ను తొల‌గిస్తున్నామ‌ని పేర్కొంది.

రిజ‌ర్వేష‌న్ల నేపథ్యంలో మార్పు

తెలంగాణ ప్రభుత్వం 15% నాన్ లోకల్ సీట్లు రద్దు చేయడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వ‌చ్చింది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఈ సీట్ల కోసం పోటీ పడేవారు. ఇప్పుడు ఆ అవకాశమే లేకుండా పోయింది.
ఇప్పటివరకు ప్రతి ఏడాది TG EAPCETలో సుమారు 55 వేల మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పాల్గొనేవారు. ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేవారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. గుంటూరులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు తెలంగాణలో ప్రవేశ పరీక్ష రాయడానికి ఇక్క‌డికే రావాల్సి ఉంటుంది.

TG EAPCET 2025 : అన్‌రిజర్వ్‌డ్‌ కోటాలోఓ 15% సీట్లు

సాధార‌ణంగా సుమారు 3,000 మంది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh students) విద్యార్థులు తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరుతుంటారు. కానీ ఇప్పుడు 15% నాన్ లోక‌ల్‌ కోటా రద్దు చేయడంతో ఈ సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇక తెలంగాణ విద్యార్థుల (Telangana students)కు ఎక్కువ సీట్లు లభించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 15% నాన్ లోక‌ల్‌ కోటాను తొలగించడంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తెలంగాణలో ఉన్న కళాశాలల్లో ప్రవేశాలు దాదాపుగా లభించే అవకాశం తగ్గిపోయింది. తెలంగాణ విద్యార్థులకే ఎక్కువ అవకాశాలు లభించనున్నాయి. 85% సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15% సీట్లు అన్‌రిజర్వ్‌డ్‌ కోటాలో ఉంటాయి.

తెలంగాణ విద్యార్థుల‌కే ఎక్కువ సీట్లు

తెలంగాణలో 10 సంవత్సరాల పాటు నివసించినవారు కూడా అన్‌రిజర్వ్‌డ్ సీట్ల కోసం పోటీ పడొచ్చు. అలాగే, తల్లిదండ్రులు లేదా జీవితం భాగస్వామి ప్రభుత్వ ఉద్యోగం కారణంగా తెలంగాణలో పని చేస్తున్న వారు కూడా అన్‌రిజర్వ్‌డ్‌ సీట్లలో పోటీ పడొచ్చు. అయితే, తెలంగాణ విద్యార్థులే ఈ సీట్లలో ఎక్కువగా అవకాశాలు పొందే అవకాశం ఉంది. దీంతో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో తెలంగాణ విద్యార్థులకే పెద్ద సంఖ్యలో ప్రవేశ అవకాశాలు లభించనున్నాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version