Sarkar Live

US tariff hike | నో టెన్ష‌న్‌.. టారిఫ్‌ల ప్ర‌భావం తక్కువే.. : విశ్లేష‌కులు

US tariff hike | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించిన ప‌ర‌స్ప‌ర సుంకాల (టారిఫ్‌) నిర్ణ‌యం భారత ఆటోమోటివ్ పరిశ్రమ (Indian automotive manufacturers)పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదంటున్నారు విశ్లేష‌కులు. భారతీయ వాహన తయారీదారులు ప్రధానంగా దేశీయ

US tariff hike

US tariff hike | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించిన ప‌ర‌స్ప‌ర సుంకాల (టారిఫ్‌) నిర్ణ‌యం భారత ఆటోమోటివ్ పరిశ్రమ (Indian automotive manufacturers)పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదంటున్నారు విశ్లేష‌కులు. భారతీయ వాహన తయారీదారులు ప్రధానంగా దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడుతుంటార‌ని, అమెరికా టారిఫ్‌లు ఎక్కువైనా ప్ర‌భావం (impact) అంతంత మాత్ర‌మే ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

US tariff hike ప్ర‌భావం ఎందుకు ఉండ‌దంటే..

మూల భాగాల స్థానికీకరణ, దేశీయ అమ్మకాలు ఎక్కువగా ఉండటం, అమెరికాకు ఎగుమతులు తక్కువగా ఉండటం వల్ల వాహన తయారీదారులు ఈ టారిఫ్‌ల‌తో పెద్ద‌గా న‌ష్ట‌పోయేదేం లేదంటున్నారు ఎస్ అండ్ పీ గ్లోబల్ మొబిలిటీ ఇండియా, ఏషియ‌న్ డైరెక్టర్ పునీత్ గుప్తా (Puneet Gupta). అయితే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) వంటి కంపెనీలు ఈ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని విశ్లేష‌కులు అంటున్నారు. ఇది ఐచర్ మోటార్స్ లిమిటెడ్ (Eicher Motors Ltd) కు చెందిన బైక్ తయారీ సంస్థ‌. దీంతోపాటు అమెరికా మార్కెట్‌లో 650 సీసీ మోటార్‌సైకిళ్లకు ప్రధాన ఎగుమతిదారు ఈ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ. కొన్ని ఆటో భాగాల తయారీదారులు కూడా. అధిక సుంకాల కారణంగా ఈ సంస్థ‌ ప్రభావితమయ్యే అవకాశం ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మార్గన్ స్టాన్లీ నివేదిక ప్రకారం పరస్పర సుంకాల పెంపు (US tariff hike ) ద్వారా ప్రత్యక్ష ప్రభావం నిర్వహణలో ఉండొచ్చు. కానీ వ్యాపార నమ్మకంపై అనిశ్చితి ద్వారా పరోక్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే, దేశీయ విధానాలు వృద్ధికి మద్దతుగా ఉంటాయి, డౌన్‌సైడ్ రిస్క్‌లు వస్తే అదనపు చర్యలు తీసుకుంటారు.

మిష‌న్ 500.. మోదీ, ట్రంప్ ఉమ్మ‌డి ల‌క్ష్యం

తమ పౌరులను మరింత సుసంపన్నం చేస్తూ త‌మ దేశాల‌ను ఆర్థికంగా బ‌లోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా కీల‌క‌ ఒప్పందాలు చేసుకున్న‌ట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి సంకల్పించామ‌న్నారు. దీంతో 2030 నాటికి 500 బిలియన్ల డాల‌ర్ల‌కు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. దీనికి మిష‌న్ 500 అనే పేరు పెట్టారు. 2025 చివరినాటికి పరస్పర ప్రయోజనకరమైన బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) మొదటి విడతను చర్చించడానికి ప్రణాళికలను వారు ప్రకటించారు. ఈ చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి, వాణిజ్య సంబంధం పూర్తిగా COMPACT ఆకాంక్షలను ప్రతిబింబించేలా సీనియర్ ప్రతినిధులను నియమించాల‌ని నిర్ణ‌యించారు.
BTAను ముందుకు తీసుకెళ్లడానికి, అమెరికా భారతదేశ వస్తువులు, సేవల రంగంలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయడానికి సమగ్ర దృక్కోణాన్ని అవలంబిస్తాయ‌ని భావిస్తున్నారు.

ఎగుగుమ‌తులు పెంచుకొనే ఒప్పందాలు

పారిశ్రామిక వస్తువుల అమెరికా ఎగుమతులను భారతదేశానికి, శ్రామిక సాంద్రత ఉత్పత్తుల భారతీయ ఎగుమతులను అమెరికాకు పెంచడానికి ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. అంతేకాకుండా వ్యవసాయ వస్తువుల వాణిజ్యాన్ని పెంచేందుకు కలిసి పనిచేయడానికి అంగీకారానికి వ‌చ్చాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version