Sarkar Live

Vemulawada | వేముల‌వాడ‌లో ముమ్మ‌రంగా కూల్చివేత‌లు

Rajanna Siricilla News | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన‌ వేములవాడలో (Vemulawada) బుల్డోజ‌ర్లు (Bulldozers) కూల్చివేత‌లు ప్రారంభించాయి. సోమ‌వారం ఉద‌యం నుంచే అధికారులు ప్ర‌దాన‌ రోడ్ల వెంట‌ భవనాలను కూల్చివేస్తున్నారు. వేముల‌వాడ‌ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ (Vemulawada

Vemulawada

Rajanna Siricilla News | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన‌ వేములవాడలో (Vemulawada) బుల్డోజ‌ర్లు (Bulldozers) కూల్చివేత‌లు ప్రారంభించాయి. సోమ‌వారం ఉద‌యం నుంచే అధికారులు ప్ర‌దాన‌ రోడ్ల వెంట‌ భవనాలను కూల్చివేస్తున్నారు. వేముల‌వాడ‌ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ (Vemulawada Road expansion ) పనులలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా బిల్డింగ్‌లను నేలమట్టం చేస్తున్నారు. మొత్తం 10 జేసీబీలతో పది బృందాలు నిర్విరామంగా కూల్చివేత‌లు చేప‌డుతున్నాయి. అధికారుల‌ను ఈ పనులను క్షేత్ర‌స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఇండ్లు, దుకాణాలను య‌జ‌మానులు దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కూలీలలో సామాన్లు తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్య‌లో పోలీసులను మోహరించారు. అయితే ప్రధాన రోడ్డు వైపు వాహనాలు రాకుండా అమరవీరుల స్తూపం వద్ద బారికేడ్లు ఏర్పాటుచేశారు

Vemulawada : రోడ్ల విస్తరణకు రూ.47కోట్లు..

కాగా వేములవాడలో రోడ్ల విస్తరణ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.47 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 6 గంటల నుండి పెద్ద ఎత్తున కూల్చివేతలు జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా యంత్రాంగం, పోలీసులు పర్యవేక్షణను ముమ్మరం చేశారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఆర్అండ్ బి, మున్సిపల్, ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పిటిషన్లు సమర్పించడానికి కలెక్టరేట్‌కు రావద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇంతలో, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా నిరోధించడానికి పోలీసు సూపరింటెండెంట్ గీతె మహేష్ బాబాసాహెబ్ సీనియర్ పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కూల్చివేత స్థలంలో దాదాపు 200 మంది సిబ్బందిని మోహరించినట్లు సమాచారం. తొలగింపు నోటీసుల తర్వాత, అనేక వ్యాపార సంస్థలు, నివాసితులు స్వచ్ఛందంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. శాంతిభద్రతలను కాపాడటానికి, పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు, పని పూర్తయ్యే వరకు కూల్చివేత జోన్ నుంచి 100 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడకుండా నిషేధించారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (గతంలో సెక్షన్ 144 CrPC)లోని సెక్షన్ 163(3)ని కూడా అమలు చేశారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Facebook Twitter LinkedIn WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!
Exit mobile version