Budget Session 2025 | బడ్జెట్ సమావేశాలు షురూ.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
Budget Session 2025 LIVE : బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu), పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రయాగ్రాజ్లో ఇటీవల జరిగిన కుంభోమేళాలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను ఆమె స్మరించుకున్నారు. ప్రస్తుత పాలనా విజయాలను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వాల కంటే మూడింతల వేగంతో ప్రభుత్వం మూడోసారి అభివృద్ధి చెందుతోందని ఆమె వ్యాఖ్యానించారు.
అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi) ప్రసంగించారు. పేద, మధ్యతరగతి వారికి ఆశీస్సులు ప్రసాదించాలని లక్ష్మీ దేవిని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ సెషన్ 'విక్షిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం ) లక్ష్యాన్ని సాధించడంలో కొత్త విశ్వాసం శక్తిని నింపుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు . దేశ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన రోడ్...

