Sarkar Live

State

​వ్యాపారాల అభివృద్ధికి ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’ తప్పనిసరి: అదనపు డీఆర్‌డీఓ రేణుకా దేవి
warangal

​వ్యాపారాల అభివృద్ధికి ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’ తప్పనిసరి: అదనపు డీఆర్‌డీఓ రేణుకా దేవి

చిన్న వ్యాపారమైనా, పెద్ద కంపెనీ అయినా ప్రభుత్వ గుర్తింపు ఉంటేనే మరిన్ని అవకాశాలు లభిస్తాయని, ప్రతి మహిళా పారిశ్రామికవేత్త తన వ్యాపారాన్ని 'ఉద్యమ్'లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అదనపు డీఆర్‌డీఓ రేణుకా దేవి పిలుపునిచ్చారు. ​శుక్రవారం గీసుగొండ మండల కేంద్రంలోని ప్రగతి మండల సమైక్య కార్యాలయంలో, అధ్యక్షురాలు గట్టు రాధిక అధ్యక్షతన వీఓఏలకు (VOA) నిర్వహించిన మండల స్థాయి శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి మహిళా ఆదాయాభివృద్ధి కార్యక్రమాన్ని ఉద్యమ్ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ​ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రయోజనాలు ​తక్కువ వడ్డీకే రుణాలు: బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేట్లతో లోన్లు పొందే అవకాశం. ​ప్రభుత్వ చేయూత: ప్రభుత్వ టెండర్లలో ప్రాధాన్యత, వివిధ సబ్సిడీ పథకాలు. ​మార్కెటింగ్ సౌకర్యం: బ్రాండింగ్, ల...
Boiled Rice | 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించండి! కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విన్నపం..
State

Boiled Rice | 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించండి! కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విన్నపం..

తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి భారీ ఎత్తున బాయిల్డ్ రైస్ సేకరించాలని, పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరణ తెలంగాణలో యాసంగి (Rabi) పంట బాయిల్డ్ రైస్ (Boiled Rice ) మిల్లింగ్‌కు ఎంతో అనుకూలమని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ఈ యాసంగి సీజన్‌లో తెలంగాణలో సుమారు 90 ఎల్ఎంటీ (LMT) ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ (5% నూకతో), 5 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్ (10% నూకతో) సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం స్పంద...
ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై విజిలెన్స్​ అధికారుల మెరుపు దాడులు
warangal

ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై విజిలెన్స్​ అధికారుల మెరుపు దాడులు

ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం విజిలెన్స్​ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ మెరుపు దాడితో కార్యాలయ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ​అధికారుల దిగ్బంధం: నమ్మదగిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన అధికారుల బృందం, కార్యాలయానికి చేరుకున్న వెంటనే ప్రధాన ద్వారాలను మూసివేసింది. లోపల ఉన్న సిబ్బందిని, బయట ఉన్న దస్తావేజు లేఖరులను ఎవరినీ లోపలికి రానివ్వకుండా, లోపల ఉన్నవారిని బయటకు వెళ్లనివ్వకుండా అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. ​కీలక పత్రాల పరిశీలన: ప్రస్తుతం కార్యాలయంలోని రికార్డులను, నగదు రిజిస్టర్లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో జరిగిన భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఫైళ్లను, అనధికారిక లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకే ఈ దాడులు చేపట్టినట్ల...
వడగాల్పుల సెగ.. సిగ్నల్స్ వద్ద చుక్కలు చూస్తున్న వాహనదారులు! – Warangal Traffic
State

వడగాల్పుల సెగ.. సిగ్నల్స్ వద్ద చుక్కలు చూస్తున్న వాహనదారులు! – Warangal Traffic

​సీపీ సార్.. కాస్త 'నీడ'నివ్వండి - గ్రీన్ మ్యాట్ల కోసం వాహనదారుల వేడుకోలు ​Warangal Traffic | ఓ వైపు నిప్పులు కురిపిస్తున్న భానుడు.. మరోవైపు ట్రాఫిక్ సిగ్నల్ పడగానే సెగలు కక్కుతున్న తారు రోడ్లు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఎండల తీవ్రత రోజురోజుకూ మిన్నంటుతోంది. మధ్యాహ్నం 12 దాటిందంటే చాలు, వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే వణికిపోతున్నారు. ​Warangal Traffic : సిగ్నల్ పడితే ‘నిప్పుల కొలిమే’ ​నగరంలోని ప్రధాన కూడళ్లయిన హన్మకొండ అదాలత్,పోలీస్ హెడ్ క్వార్టర్స్, అశోక జంక్షన్, ములుగు రోడ్, ఎంజీఎం,వరంగల్ చౌరస్తా,పోచంమైదాన్, హెడ్ పోస్టాఫీస్, కాజీపేట వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్ పడగానే వాహనదారులు అల్లాడిపోతున్నారు. 60 నుండి 90 సెకన్ల పాటు ఎండలో వేచి ఉండటం నరకప్రాయంగా మారింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, వృద్ధులు, చిన్న పిల్లలతో ప్రయాణించే వారు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ​గత ఏ...
తోటి (PVTG) తెగ సమస్యల పరిష్కారానికి వినతి: అధికారుల సానుకూల స్పందన
State, Hyderabad

తోటి (PVTG) తెగ సమస్యల పరిష్కారానికి వినతి: అధికారుల సానుకూల స్పందన

తెలంగాణలోని మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసి తోటి (PVTG) తెగ ప్రజల చిరకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 'తెలంగాణ ఆదివాసి తోటి PVTG సేవా సంఘం' నేతలు మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర రెడ్డిని కలిశారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో విస్తరించి ఉన్న తమ తెగ సామాజిక, ఆర్థిక స్థితిగతులను ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ​ప్రధాన డిమాండ్లు.. ​రేషన్ కార్డులు: ఏజెన్సీ ప్రాంతాల్లో లాగే మైదాన ప్రాంత తోటి కుటుంబాలకూ 30 కిలోల బియ్యం వచ్చేలా అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలి. ​ఉపాధి & విద్య: ట్రైకార్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయాలని కోరారు. ​సాంస్కృతిక రక్షణ: తోటి తెగ విశిష్ట వాయిద్యాలైన బుర్ర - మద్దెలను ట్రైబల్ మ్యూజియంలో ప్రదర్శించాలి. ​కుల ధ్రువీకరణ: కరీంనగర్ జిల్లాలో 'రా...
error: Content is protected !!