ధాన్యం మళ్లింపుపై దర్యాప్తు జరగాల్సిందే: హైకోర్టు కీలక తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ధాన్యం మళ్లింపు వ్యవహారంపై దర్యాప్తు కొనసాగాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మిల్లర్లపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయడానికి నిరాకరిస్తూ, వారి పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.
ప్రధానాంశాలు..
కేసు నేపథ్యం: 2022-23 కాలంలో మిల్లింగ్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు సొంత ప్రయోజనాల కోసం మళ్లించారని, ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా రూ. 3,960 కోట్ల మేర బకాయి పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
మిల్లర్ల వాదన: ధాన్యం నాణ్యత సరిగా లేదని, ప్రభుత్వం మిల్లింగ్ ఛార్జీలు, గన్నీ బ్యాగుల ఖర్చులు చెల్లించలేదని, అందుకే తాము బాధ్యులం కాదంటూ సుమారు 360 మంది మిల్లర్లు 58 పిటిషన్లు దాఖలు చేశారు.
ప్రభుత్వ వాదన: మిల్లర్లు ధాన్యాన్ని అమ్ముకుని ఆ సొమ్మును సినిమా రంగం, ఇతర స్థిర, చరాస్తుల్లో పెట్టుబడులుగా పెట్టారని అడ్వకేట్ జనరల్ వాదించారు.
కోర్టు వ్యాఖ్య...




