Sarkar Live

State

ధాన్యం మళ్లింపుపై దర్యాప్తు జరగాల్సిందే: హైకోర్టు కీలక తీర్పు
Hyderabad

ధాన్యం మళ్లింపుపై దర్యాప్తు జరగాల్సిందే: హైకోర్టు కీలక తీర్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ధాన్యం మళ్లింపు వ్యవహారంపై దర్యాప్తు కొనసాగాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మిల్లర్లపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయడానికి నిరాకరిస్తూ, వారి పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ​ప్రధానాంశాలు.. ​కేసు నేపథ్యం: 2022-23 కాలంలో మిల్లింగ్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు సొంత ప్రయోజనాల కోసం మళ్లించారని, ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా రూ. 3,960 కోట్ల మేర బకాయి పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ​మిల్లర్ల వాదన: ధాన్యం నాణ్యత సరిగా లేదని, ప్రభుత్వం మిల్లింగ్ ఛార్జీలు, గన్నీ బ్యాగుల ఖర్చులు చెల్లించలేదని, అందుకే తాము బాధ్యులం కాదంటూ సుమారు 360 మంది మిల్లర్లు 58 పిటిషన్లు దాఖలు చేశారు. ​ప్రభుత్వ వాదన: మిల్లర్లు ధాన్యాన్ని అమ్ముకుని ఆ సొమ్మును సినిమా రంగం, ఇతర స్థిర, చరాస్తుల్లో పెట్టుబడులుగా పెట్టారని అడ్వకేట్ జనరల్ వాదించారు. ​కోర్టు వ్యాఖ్య...
డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం..  ఇకపై పీడీ యాక్ట్ అమలు!
State, Hyderabad

డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. ఇకపై పీడీ యాక్ట్ అమలు!

Drugs Control Telangana | రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడిని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకున్నట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) స్పష్టం చేశారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన గురువారం తొలిసారిగా 'ఈగల్ ఫోర్స్' , పోలీస్ శాఖలోని 35 విభాగాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్ కేసుల్లో పదేపదే పట్టుబడే నిందితులపై పీడీ యాక్ట్ తరహా కఠిన చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. కేవలం అరెస్టులతోనే సరిపెట్టకుండా, డ్రగ్స్ సరఫరాదారుల ఆస్తులను కూడా సీజ్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ముఖ్యంగా విద్యాసంస్థల విషయంలో డీజీపీ అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై పాఠశాలలు, కాలేజీలు లేదా యూనివర్సిటీ ప్రాంగణాల్లో డ్రగ్స్ దొరికితే, దానికి పూర్తి బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని ఆయన కుండబద్దలు కొట్టారు. డ్రగ్స్ సరఫరాతో పాటు డిమాండ్ ఉన్న ప్రాంతాలపై కూడా తాము ప...
తెలంగాణ లో నామినేటెడ్ పదవుల జాతర షురూ..
Hyderabad

తెలంగాణ లో నామినేటెడ్ పదవుల జాతర షురూ..

కార్పొరేషన్ లకు చైర్మన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది ​బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ - బస్వరాజ్ శ్రీనివాస్ ​వాషర్‌మెన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ - దాసరిరాజు అజయ్ కుమార్ ​గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ - ముతుకూరి చంద్రశేఖర్ గౌడ్ ​మెరిక సహకార కార్పొరేషన్ చైర్మన్ - దొంగరి వెంకటేశ్వర్లు ​మేదర సహకార కార్పొరేషన్ చైర్మన్ - సంగ వెంకట్రాజం ​వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్ చైర్మన్ - గట్టు తిమ్మప్ప ​మున్నూరు కాపు సహకార కార్పొరేషన్ చైర్మన్ - బొమ్మ శ్రీరామ్ ​యాదవ సహకార కార్పొరేషన్ చైర్మన్ - ఎం. రఘునాథ్ యాదవ్ ​వడ్డెర సహకార కార్పొరేషన్ చైర్మన్ - కుంట రేణుక నారాయణ ​చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ - గూడెం వెంకటరమణ ​కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ - బండి రమేష్ ​పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్ - గూడూరు శ్రీనివాస్ ​భట్టరాజ కోఆపరేటివ్ సొసైటీ ఫ...
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఓ చిత్తుకాగితం.. వరంగల్ రైతు సదస్సులో కేటీఆర్ ధ్వజం!
warangal

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఓ చిత్తుకాగితం.. వరంగల్ రైతు సదస్సులో కేటీఆర్ ధ్వజం!

KTR Rythu Sangrama Sadassu Warangal | అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ మే 6, బుధవారం వరంగల్ నగరాన్ని వేదికగా చేసుకుని 'రైతు సంగ్రామ సదస్సు' (Rythu Sangrama Sadassu)ను నిర్వహించింది. గ్రీన్ వుడ్ స్కూల్ సమీపంలోని 4 ఎకరాల విశాలమైన మైదానంలో జరిగిన ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి సీఎం కాదని, ఆయన ఒక 'ఎగవేతల రేవంత్ రెడ్డి' అని ఎద్దేవా చేశారు. ఒట్టు పెట్టి మోసం చేశారు.. భద్రకాళి అమ్మవారి సాక్షిగా వరంగల్ వచ్చి రుణమాఫీ చేస్తానని ఒట్టు పెట్టుకున్న రేవంత్ రెడ్డి, నేడు ఆ మాట తప్పి రైతులను వంచించారని కేటీఆర్ మండిపడ్డారు. "దమ్ముంటే రేవంత్ రెడ్డి ఏదైనా ఒక గ్రామానికి రావాలి.. ఆ ఊరిలో రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే, నేను నా ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తాను" అని కేటీఆర్ బహి...
తెలంగాణలో భూముల ధరల పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్: విద్యుత్ అక్రమాలపై సీబీఐ విచారణ!
State, Hyderabad

తెలంగాణలో భూముల ధరల పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్: విద్యుత్ అక్రమాలపై సీబీఐ విచారణ!

Telangana Land Rates Hike | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా భూముల ధరల సవరణ మరియు గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ అక్రమాలపై కీలక చర్యలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూముల ధరల సవరణ (Telangana Land Rates Hike) రాష్ట్రంలో వాస్తవ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు భూముల విలువలను సవరించాలని కేబినెట్ నిర్ణయించింది. అమలు: సవరించిన కొత్త ధరలు ఈ నెల చివరి వారం నుండి అమల్లోకి రానున్నాయి. రేషనలైజేషన్: మార్కెట్ విలువల రేషనలైజేషన్ చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పరిహారం: రోడ్ల విస్తరణ, ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే నిర్వాసితులకు శాస్త్రీయ పద్ధతిలో మెరుగైన పరిహారం అందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యం. హిల్ట్ పాలసీ: ...
error: Content is protected !!