కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఓ చిత్తుకాగితం.. వరంగల్ రైతు సదస్సులో కేటీఆర్ ధ్వజం!
KTR Rythu Sangrama Sadassu Warangal | అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ మే 6, బుధవారం వరంగల్ నగరాన్ని వేదికగా చేసుకుని 'రైతు సంగ్రామ సదస్సు' (Rythu Sangrama Sadassu)ను నిర్వహించింది. గ్రీన్ వుడ్ స్కూల్ సమీపంలోని 4 ఎకరాల విశాలమైన మైదానంలో జరిగిన ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి సీఎం కాదని, ఆయన ఒక 'ఎగవేతల రేవంత్ రెడ్డి' అని ఎద్దేవా చేశారు.
ఒట్టు పెట్టి మోసం చేశారు..
భద్రకాళి అమ్మవారి సాక్షిగా వరంగల్ వచ్చి రుణమాఫీ చేస్తానని ఒట్టు పెట్టుకున్న రేవంత్ రెడ్డి, నేడు ఆ మాట తప్పి రైతులను వంచించారని కేటీఆర్ మండిపడ్డారు. "దమ్ముంటే రేవంత్ రెడ్డి ఏదైనా ఒక గ్రామానికి రావాలి.. ఆ ఊరిలో రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే, నేను నా ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తాను" అని కేటీఆర్ బహి...




