Sarkar Live

Crime

వరంగల్‌లో భారీ ‘బ్లాక్ మనీ’ ముఠా గుట్టురట్టు: ఎనిమిది మంది అరెస్టు!
Crime

వరంగల్‌లో భారీ ‘బ్లాక్ మనీ’ ముఠా గుట్టురట్టు: ఎనిమిది మంది అరెస్టు!

అమాయక ప్రజలకు ఆశ చూపి తక్కువ డబ్బుకు ఎక్కువ మొత్తంలో కరెన్సీ ఇస్తామంటూ మోసం చేస్తున్న అంతర్ జిల్లా ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. నకిలీ నోట్లను ముద్రించే ముగ్గురితో పాటు, 'బ్లాక్ పేపర్' మాయాజాలంతో మోసం చేసే మరో ఐదుగురిని టాస్క్‌ఫోర్స్ మరియు నర్సంపేట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ​ఏమిటీ మాయాజాలం? ​ఈ ముఠా ప్రధానంగా రెండు పద్ధతుల్లో మోసాలకు పాల్పడేది. ​కలర్ ప్రింటింగ్: ల్యాప్‌టాప్‌లు, కలర్ ప్రింటర్ల సహాయంతో ₹100 నోట్లను ముద్రించి మార్కెట్లో చలామణి చేయడం. ​బ్లాక్ పేపర్ మోసం (1:3 ఆఫర్): అసలు ₹500 నోట్లకు కెమికల్స్ పూసి నల్లగా మార్చి, తిరిగి వాటిని శుభ్రం చేసి చూపడం ద్వారా బాధితులను నమ్మించేవారు. తీరా డబ్బులు తీసుకున్నాక, కేవలం నల్ల కాగితాల కట్టలను ఇచ్చి పరారయ్యేవారు. ​స్వాధీనం చేసుకున్న సొత్తు: ​నగదు: ₹1,48,000 అసలు కరెన్సీ. ​పరికరాలు: ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్ల...
కరీంనగర్‌లో పట్టపగలే కాల్పుల కలకలం: PMJ జ్యూవెలరీలో భారీ దోపిడీ!
Crime

కరీంనగర్‌లో పట్టపగలే కాల్పుల కలకలం: PMJ జ్యూవెలరీలో భారీ దోపిడీ!

​జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలోని PMJ జ్యూవెలరీ షాపులో ఆదివారం ఉదయం దుండగులు చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ​ఉదయం 10 గంటల ప్రాంతంలో షాపు తెరిచిన కొద్దిసేపటికే, గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో లోపలికి ప్రవేశించారు. సిబ్బందిని బెదిరించి నగలను దోచుకునే క్రమంలో అడ్డువచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.ఈ ఘటనలో నలుగురు షాపు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.లాకర్లలో ఉన్న భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను బ్యాగుల్లో నింపుకుని దుండగులు క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు.​సమాచారం అందుకున్న వెంటనే కరీంనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. ​"పట్టపగలు, నగర న...
పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగించాలి: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్
Crime

పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగించాలి: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

​ పోలీస్ స్టేషన్‌కు వచ్చే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందనే బలమైన నమ్మకాన్ని కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. విధుల నిర్వహణలో అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖ గౌరవాన్ని ఇనుమడింపజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ​పదోన్నతి పొందిన అధికారుల మర్యాదపూర్వక భేటీ ​వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ల స్థాయి నుండి ఏసీపీ (ACP) లుగా పదోన్నతి పొందిన గొర్ల సీతారెడ్డి, బోలగాని శ్రీనివాస్ గౌడ్, సార్ల రాజు లు శుక్రవారం సీపీ క్యాంపు కార్యాలయంలో కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు సీపీకి పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.​అధికారులను అభినందించిన అనంతరం కమిషనర్ పలు కీలక సూచనలు చేశారు.పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, వాటిని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.నిరంతరం క్షేత్రస్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షిస్తూ, వారికి సరై...
తెలంగాణ పోలీసులకు శుభవార్త
Crime

తెలంగాణ పోలీసులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర పోలీసులు కు డీజీపీ బి. శివధర్ రెడ్డి శుభవార్త చెప్పారు. పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు. హోదాతో నిమిత్తం లేకుండా కానిస్టేబుల్ నుండి ఉన్నతాధికారుల వరకు అందరికీ ఈ సెలవు వర్తిస్తుంది. ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు.. ​సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం ద్వారా వారిలో పని పట్ల ఉత్సాహం, మనోధైర్యం పెరుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర పరిస్థితులు (శాంతిభద్రతల సమస్యలు) ఉంటే తప్ప, సిబ్బంది కోరినప్పుడు యూనిట్ అధికారులు ఈ సెలవులను నిరాకరించకూడదు. సర్వీస్ రిజిస్టర్‌లో నమోదైన తేదీల ఆధారంగానే ఈ ప్రత్యేక సెలవులు మంజూరు చేయబడతాయి. నిబంధనలు.. ​సెలవు కావాల్సిన సిబ్బంది ముందుగానే రాతపూర్వక అభ్యర్థనను తమ పై అధికారులకు అందజేయాలి. ​ రాష్ట్రంలో అత్యంత కీలకమైన భద్రతా పరమైన సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే ఈ సెలవుకు మి...
RTC Strike | నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత: డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం
Crime

RTC Strike | నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత: డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్.. 90 శాతం కాలిన గాయాలతో ఎంజీఎంకు తరలింపు! RTC Strike | తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉగ్రరూపం దాల్చుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న కార్మికులు, ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ప్రాణత్యాగాలకు సిద్ధపడుతుండటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేట (Narsampet) డిపో వద్ద ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌ గౌడ్ (Shankar Goud) ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని.. నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న బోలా శంకర్ గౌడ్ () , గత రెండు రోజులుగా సాగుతున్న సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే, ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడం, తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆవేదనతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. నిరసన ప్రదర్శన జరుగుతున్న స...
error: Content is protected !!