Delhi Elections : కేజ్రీవాల్ను ఓడించిన ప్రవేశ్ వర్మ ఎవరు?
Delhi Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) భారీ విజయం సాధించింది .70 స్థానాలకు గాను 48 స్థానాలను కైవసం చేసుకున్న బిజెపి.. 27 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వస్తోంది. న్యూఢిల్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ (Pravesh Verma), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను 4,089 ఓట్ల తేడాతో ఓడించడంతో దేశ రాజకీయాల్లో ఆయన ఇపుడు పాపులర్ అయ్యారు..
న్యూఢిల్లీ సీటును బిజెపి (BJP) తరపున అరవింద్ కేజ్రీవాల్ను ఓడించి గెలుచుకున్న పర్వేష్ వర్మ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడించిన తర్వాత, ప్రవేశ్ వర్మ అభ్యర్థిత్వం మరింత బలపడింది. అయితే, బిజెపి అగ్ర నాయకత్వం తన నిర్ణయాలతో చాలాసార్లు ఆశ్చర్యపరిచినందున, ప్రవేశ్ వర్మ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం చాలా తొందపాటవుతుంది.
...



