Sarkar Live

Day: February 16, 2025

IPL 2025 Schedule : 65 రోజుల్లో 74 మ్యాచ్‌లు.. ఐపీఎల్‌ 2025 షెడ్యూల్ ఇదే..
Sports

IPL 2025 Schedule : 65 రోజుల్లో 74 మ్యాచ్‌లు.. ఐపీఎల్‌ 2025 షెడ్యూల్ ఇదే..

IPL 2025 Schedule | వేస‌వి సెలవుల్లో క్రికెట్ అభిమానుల‌కు ఎగిరి గంతేసే వార్త ఇది.. త్వ‌ర‌లో ఐపీఎల్‌ 2025 హంగామా మొదలుకానుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 18వ ఎడిషన్‌ షెడ్యూల్ విడుద‌లైంది. మార్చి 22న ఈ సీజన్‌ మొదలు కానుంది. 65 రోజుల పాటు కొనసాగే ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు నిర్వ‌హించ‌నున్నారు. మే 18వ తేదీతో లీగ్‌ దశ ముగిసిపోతుంది. మే 20 నుంచి 25 వరకు ప్లే ఆఫ్స్ జ‌రుగుతుఆయి. మే 25న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ఉత్కంఠ‌భ‌రితంగా ఫైనల్‌ మ్యాచ్ ఉంటుంది. ఈడెన్ గార్డెన్‌లోనే క్వాలిఫైయర్‌ 2 మ్యాచ్‌కు సైతం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సీజన్‌లో తొలిమ్యాచ్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరగనుంది. తొలి మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ఉంది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మార్చి 23న తన సొంత మైదానం ( ఉ...
Vikatan website | ప్ర‌ధానిపై వ్యంగ్యం.. కార్టూన్‌పై వివాదం
Technology

Vikatan website | ప్ర‌ధానిపై వ్యంగ్యం.. కార్టూన్‌పై వివాదం

Vikatan website : తమిళనాడు (Tamil Nadu)లో అత్యంత ప్రాచుర్యమున్న మీడియా సంస్థ వికటన్ (Vikatan) . ఇదిప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) పై రూపొందించిన ఒక కార్టూన్ కార‌ణంగా ఆ వెబ్‌సైట్ బ్లాక్ అయ్యింద‌నే వార్త‌లు వస్తున్నాయి. దీనిపై మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌స్తున్నాయి. ఈ చ‌ర్య‌ల‌ను కొంద‌రు స‌మ‌ర్థిస్తుండ‌గా మ‌రికొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు. Vikatan website blocked ఎలా అయ్యింది? వికటన్ మీడియా తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… విక‌ట‌న్ అధికారిక వెబ్‌సైట్ (website) ఆకస్మాత్తుగా నిన్న రాత్రి నుంచి అందుబాటులో లేకుండా పోయింది. ఇది త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశమైంది. అస‌లు ఈ వెబ్‌సైట్ ఎందుకు బ్లాక్ అయ్యిందో తెలియ‌రాలేదు. బ్లాక్ చేసిందెవ‌రో, ఎవ‌రు చేయించారో స్ప‌ష్ట‌త లేదు. ప్ర‌ధాని మోదీపై వ్యంగ్యంగా ఈ వెబ్‌సైట్ ఓ కార్టూన్‌ను ప్ర‌చుర...
Child | ప‌సిపాప గొంతు కోసి.. చెత్త‌కుండీలో ప‌డేసి.. ఓ త‌ల్లి దారుణం
Crime

Child | ప‌సిపాప గొంతు కోసి.. చెత్త‌కుండీలో ప‌డేసి.. ఓ త‌ల్లి దారుణం

Mother cut her Child's throat : ఆడ బిడ్డ‌ను వ‌ద్ద‌నుకుంది ఆ కిరాత‌క త‌ల్లి. త‌న‌కు పుట్టిన పాప‌నే దారుణంగా చంపాల‌నుకుంది. గొంతు కోసి, చెత్త‌కుండీలో ప‌డేసింది. ఇందుకు ఆమె త‌ల్లి (ప‌సికందు అమ్మ‌మ్మ) స‌హ‌క‌రించింది. మ‌ధ్య‌ప్రదేశ్ (Madhya Pradesh)లో ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇంత దారుణ‌మా? ఆడపిల్లలను ఇంటికి భారమని భావించి పుట్టుకతోనే చంపేసే ఘటనలు మన సమాజంలో ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ ఇవి పెచ్చుమీరుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో గుండెను పిండేసేద దారుణం ఒక‌టి చోటుచేసుకుంది. ఓ త‌ల్లి త‌న నెల రోజుల‌ బిడ్డ గొంతును కోసి (Mother cut her Child's throat) చెత్త‌కుండీలో ప‌డేసింది. జనవరి 11న రాయ్‌గఢ్‌లోని ఒక ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి నిర్ఘాంత‌పోయారు. వెంట‌నే పోలీసులకు సమాచారం అందించారు. ర‌క్తమోడుతుండ‌గా … సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ...
Veteran actress Krishnaveni | అల‌నాటి సినీ న‌టి కృష్ణ‌వేణి ఇక లేరు
Cinema

Veteran actress Krishnaveni | అల‌నాటి సినీ న‌టి కృష్ణ‌వేణి ఇక లేరు

అలనాటి ప్రముఖ నటి, గాయని, నిర్మాత సి.కృష్ణవేణి (Veteran actress Krishnaveni) ఇకలేరు. ఈ రోజు ఉద‌యం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన స్వగృహంలో ఆమె క‌న్నుమూశారు. కృష్ణ‌వేణికి 102 ఏళ్లు. వ‌యోభారం కార‌ణంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె తుది శ్వాస విడిచారు. సతీ అనసూయ సినిమాతో Krishnaveni తెర‌గేట్రం చిత్త‌జ‌ల్లు కృష్ణ‌వేణి (Chittajallu Krishnaveni) 1924 డిసెంబరు 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుంచి కళల పట్ల ఆసక్తి చూపిన ఆమె పాటలు పాడుతూ, నాటకాలు వేస్తూ ఆక‌ట్టుకొనేవారు. కృష్ణవేణి సినీ ప్రస్థానం 1936లో ప్రారంభ‌మైంది. 'సతీ అనసూయ' సినిమాతో ఆమె తెర‌గేట్రం చేశారు. అందం, అభినయం, మధురమైన గాత్రంతో సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రం త‌ర్వాత కృష్ణవేణి తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింప...
Stampede | ఢిల్లీ రైల్వేస్టేష‌న్‌లో విల‌యం.. 18 మంది ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాటకు కారణం ఏమిటి?
Crime

Stampede | ఢిల్లీ రైల్వేస్టేష‌న్‌లో విల‌యం.. 18 మంది ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాటకు కారణం ఏమిటి?

New Delhi Railway Station tragedy : మహాకుంభమేళాకు వచ్చిపోయే భక్తుల రద్దీ అకస్మాత్తుగా పెరగడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి ఘోర తొక్కిసలాట (New Delhi Railway Station Stampede ) జరిగిన విష‌యం తెలిసిందే.. రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 18 మంది మరణించగా, 12 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో 10 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు సహా 18 మంది మరణించారు.  ప్రమాదంపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చేర్చారు. ఆర్‌పిఎఫ్‌తో పాటు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం కూడా స్టేషన్‌కు చేరుకుంది. జనసమూహాన్ని నియంత్రించిన తర్వాత, ప్రత్యేక రైలును నడిపారు. Stampede : తొక్కిసలాటకు కారణమేమిటి? ఈ తొక్కిసలాటకు ముందు స్టేషన్‌లోని 14, 15 ప్లాట్‌ఫారమ్‌ల...
error: Content is protected !!