Terror Attack | ఉగ్రదాడితో తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం..
జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోని అనంతనాగ్ జిల్లాలోని పహెల్గామ్ (Pahalgam)లోఉగ్రవాదులు చేసిన దాడులు (Terror Attack) భయభ్రాంతులకు గురిచేశాయి. ప్రత్యేకంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడిలో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. ఈ మారణకాండలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు కూడా అసువులు బాసారు. విశాఖపట్నానికి (Visakhapatnam) చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి (Chandramouli) దుర్మరణం చెందారు. ఆయన తన భార్య నాగమణితో కలిసి పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి మనీష్ రంజన్ (Intelligence Bureau (IB) officer Manish Ranjan) కూడా మృతి చెందారు. కుటుంబంతో కలిసి బైసారన్ పర్యటనలో పాల్గొన్న మనీష్, ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.
Terror Attack : స్వర్గసీమపై రక్తపు మరకలు
పహెల్గామ...
