Sarkar Live

Day: August 22, 2025

Suryapet | పట్టపగలే అందరూ చూస్తుండగానే హత్యాయత్నం
Crime

Suryapet | పట్టపగలే అందరూ చూస్తుండగానే హత్యాయత్నం

Suryapet news | సూర్యాపేటలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను హత్య చేయడానికి దుండగులు కారులో వెంబడించారు. ఈ సంఘటన సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని బీబీగూడెం సమీపంలోని ఓ వైన్స్ ముందు తీవ్ర భయాందోళనలు సృష్టించింది. వివరాల్లోకి వెళితే సూర్యాపేట ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి శుక్రవారం బైక్ పై వెళ్తున్న ముగ్గురిని (ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు) గుర్తుతెలియని వ్యక్తులు కారులో వెంబడించగా బీబీ గూడెం సమీపంలో ఉన్న ఓ వైన్స్ షాపు ముందు బైక్ బయటపడవేసి ఆందోళనతో వైన్స్ లోపలికి వెళ్లారు. బైక్ ను వెంబడిస్తూ వస్తున్న దుండగులు కారు నుంచి దిగి ఆ ముగ్గురిని చంపడానికి కత్తులు, కర్రలతో వైన్స్ వైపు పరుగెత్తారు. ఈ క్రమంలో వైన్స్ షాప్ లో ఉన్న వారు ఒక్కసారిగా బయటికి రావడంతో వారిని చూసి కారెక్కి పారిపోయారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చ...
Sub-Registrar | రూ.5000 లంచంతీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స‌బ్ రిజిస్ట్రార్‌
Crime

Sub-Registrar | రూ.5000 లంచంతీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స‌బ్ రిజిస్ట్రార్‌

Adilabad News : రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ వరుస దాడులు కొనసాగిస్తోంది. అవినీతి అధికారుల‌కు ఏసీబీ చుక్క‌లు చూపిస్తోంది. వ‌రుస దాడుల‌తో అక్ర‌మార్కును హ‌డ‌లెత్తిస్తోంది. తాజాగా చిక్కాడు. ఆదిలాబాద్ జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ ( Sub-Registrar )ను లంచం తీసుకుంటుండగా రెడ్ హాండెడ్‌గా ప‌ట్టుకుంది. శుక్రవారం మధ్యాహ్నం రిజిస్ట్రార్‌ కార్యాయంలో బాధితుడు నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ రెడ్డి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిరిసన్నకు చెందిన మన్నూర్‌ ఖాన్‌ గిఫ్ట్ డీడ్ కోసం డాక్యుమెంట్ రైటర్ ద్వారా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. గిఫ్ట్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి రూ. 10 వేలు డిమాండ్ చేశారు. చివ‌ర‌కు రూ.5 వేలకు ఒప్పందం కుదరగా మధ్యాహ్నం సమయంలో సబ్ రిజిస్ట్రార్‌ లంచం తాలూకు డ‌బ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ...
Aarogyasri | ఆగస్టు 31 నుండి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తాం : నెట్‌వర్క్ ఆసుపత్రులు
State, Hyderabad

Aarogyasri | ఆగస్టు 31 నుండి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తాం : నెట్‌వర్క్ ఆసుపత్రులు

Aarogyasri | “ఆరోగ్యశ్రీ, EHS (ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ) JHS (జ‌ర్న‌లిస్ట్ హెల్త్ స్కీమ్‌) ల లబ్ధిదారులకు ఉచిత వైద్య‌ సేవలను అందించడంలో అనేక సమస్యలు ఎదుర‌వుతున్నాయి. ఆర్థికంగా పెనుభారం మోస్తున్నామ‌ని ఆరోగ్య‌శ్రీ (Aarogyasri) నెట్ వ‌ర్క్ ఆసుపత్రులు చాలా వరకు మూసివేయబడే ప్రమాదం పొంచి ఉందని TANHA తెలిపింది. ఈ సంవత్సరం జనవరిలో, TANHA సభ్యులు ఇలాగే నిరసన తెలుప‌గా రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఎనిమిది నెలలు గడుస్తున్నా.. అనేక సమావేశాలు జరిగినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు. TANHA యొక్క కొన్ని ప్రధాన డిమాండ్‌లు చేస్తోంది. సభ్య ఆసుపత్రులతో అవగాహన ఒప్పందాలను (నిబంధనలు షరతులు) తిరిగి రూపొందించడం, ప్యాకేజీల సవరణ, సాధారణ చెల్లింపులు, పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, ఎటువంటి ఆందోళన లేదా పరిశీలన లేకుండా ఏకపక్షంగా సర్క్యులర్‌లను జా...
error: Content is protected !!