Sarkar Live

Day: November 29, 2025

Telangana Employees | ఉద్యోగులకు స‌ర్కారు గుడ్ న్యూస్‌
State, Hyderabad

Telangana Employees | ఉద్యోగులకు స‌ర్కారు గుడ్ న్యూస్‌

పెండింగ్ బిల్లులకు రూ. 707.30 కోట్లు విడుదల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు హైదరాబాద్: రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు (Telangana Employees) తెలంగాణ స‌ర్కారు గుడ్‌ న్యూస్ చెప్పింది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు, పెండింగ్ బిల్లులకు సంబంధించిన రూ. 707.30 కోట్లను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తాజాగా ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు, ఆర్థిక శాఖ అధికారులు శనివారం నవంబర్ నెలకు సంబంధించిన ఈ నిధులను విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన మాట ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల రూ. 700 కోట్లకు పైగా నిధులను క్రమం తప్పకుండా విడుదల చేస్తూ వస్తోంది. నాలుగు నెలలుగా బకాయిల చెల్లింపు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వరుసగా నాలుగు నెలలుగా ఉద్యోగుల పెండింగ్ బకాయిలను విడుదల చేస్తూ వస్తోంది. నవంబర్ నెల...
Akhanda 2 : సింగిల్ టికెట్‌కు రూ. 2 లక్షలు – ఎన్ఆర్ఐ అభిమాని సంచలన రికార్డ్! నందమూరి అభిమానం అంటే ఇదే
Cinema

Akhanda 2 : సింగిల్ టికెట్‌కు రూ. 2 లక్షలు – ఎన్ఆర్ఐ అభిమాని సంచలన రికార్డ్! నందమూరి అభిమానం అంటే ఇదే

Akhanda 2 Ticket Price | హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వ‌స్తోన్న‌ ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2’పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 05న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో, ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ క్రమంలో, బాలకృష్ణ అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో చాటి చెప్పే అసాధారణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జర్మనీ అభిమాని రికార్డ్ సాధారణంగా ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల కోసం ఆసక్తి చూపిస్తారు. అయితే, జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు చెందిన ఎన్ఆర్ఐ (NRI) అభిమాని రాజశేఖర పర్నపల్లి ఏకంగా ఒకే టికెట్‌ను రెండు లక్షల రూపాయలు (రూ. 2,00,000) చెల్లించి కొనుగోలు చేశారు. బాలయ్యపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు ఆయన ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర నిర్మాణ బృందం సోషల్ మీడియా వేద...
Cyclone Dhitwa ఎఫెక్ట్: తెలంగాణలో పెరిగిన చ‌లితీవ్ర‌త‌, ఆ జిల్లాల్లో వర్షాలు – తాజా వాతావరణ అంచనా
Hyderabad

Cyclone Dhitwa ఎఫెక్ట్: తెలంగాణలో పెరిగిన చ‌లితీవ్ర‌త‌, ఆ జిల్లాల్లో వర్షాలు – తాజా వాతావరణ అంచనా

Cyclone Dhitwa : బంగాళాఖాతంలో ఏర్పడిన 'దిత్వా' తుఫానుతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఈ తుఫాను నెమ్మదిగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. తుఫాను ఆదివారం నాటికి పుదుచ్చేరి తీరాన్ని చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఉత్తర తెలంగాణలో చలి పంజా! దిత్వా తుఫాను ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ గణనీయంగా పెరగనుంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 30వ తేదీ వరకు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన చలి గాలులు వీచే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తిరిగి 9 డిగ్రీల నుంచి 11 డిగ్రీల సెల్సియస్కు పడిపోయే అవకాశం ఉంది.రాష్ట్ర‌ రాజధాని హైదరాబాద్‌లో కూడా మూడు రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదవుతాయని నిపుణులు హెచ్చ...
error: Content is protected !!