Telangana Employees | ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్
పెండింగ్ బిల్లులకు రూ. 707.30 కోట్లు విడుదల
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Telangana Employees) తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు, పెండింగ్ బిల్లులకు సంబంధించిన రూ. 707.30 కోట్లను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు, ఆర్థిక శాఖ అధికారులు శనివారం నవంబర్ నెలకు సంబంధించిన ఈ నిధులను విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన మాట ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల రూ. 700 కోట్లకు పైగా నిధులను క్రమం తప్పకుండా విడుదల చేస్తూ వస్తోంది. నాలుగు నెలలుగా బకాయిల చెల్లింపు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వరుసగా నాలుగు నెలలుగా ఉద్యోగుల పెండింగ్ బకాయిలను విడుదల చేస్తూ వస్తోంది. నవంబర్ నెల...


