Sarkar Live

Day: November 30, 2025

Maoist Surrender | మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: ఒకే రోజు 37 మంది లొంగుబాటు.. వారిపై రూ. 65 లక్షల రివార్డు
National

Maoist Surrender | మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: ఒకే రోజు 37 మంది లొంగుబాటు.. వారిపై రూ. 65 లక్షల రివార్డు

Maoist Surrender Dantewada : మావోయిస్టు పార్టీకి మరోమారు ఎదురుదెబ్బ‌ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ రీజియన్‌, దంతెవాడ జిల్లాలో ఆదివారం, (నవంబర్ 30) ఏకంగా 37 మంది మావోయిస్టులు పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 27 మందిపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మొత్తం రూ. 65 లక్షల రివార్డును ప్రకటించింది. ఈ 37 మందిలో 12 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. 'పూనా మర్గం'కు ఆకర్షితులై.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న 'పూనా మర్గం' (Puna Narkom - నక్సలిజం వీడి తిరిగి రండి) అనే ప్రచార కార్యక్రమానికి ఆకర్షితులై తాము లొంగిపోతున్నట్లు వారు ప్రకటించారు. తాము హింసామార్గాన్ని విడిచిపెట్టి, జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానంపై తమకు పూర్తి నమ్మకముంద‌ని మావోయిస్టులు వెల్ల‌డించారు. లొంగిపోయిన మావోయిస్టులను దంతెవాడలోని డీఆర్‌జీ (DRG) కార...
Bus Accident : ఎదురెదురుగా ఢీకొన్న ప్రభుత్వ బస్సులు.. చిన్నారితో సహా 11 మంది మృతి
National

Bus Accident : ఎదురెదురుగా ఢీకొన్న ప్రభుత్వ బస్సులు.. చిన్నారితో సహా 11 మంది మృతి

Tamil Nadu Bus Accident | శివగంగ (తమిళనాడు) : తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహా 11 మంది మృతిచెందిన‌ట్లు అధికారులు ధ్రువీకరించారు. అనేక మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన స్పందించిన స్థానికులు తిరుప్పూర్ నుంచి కరైకుడికి ఒక బస్సు, కరైకుడి నుంచి దిండిగల్‌కు మరొక బస్సు ప్రయాణిస్తుండగా, తిరుపత్తూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంట‌నే స్పందించి క్ష‌త‌గాత్రుల‌కు అవ‌స‌ర‌మైన సాయం అందించారు. గాయపడిన వారిని హుటాహుటిన శివగంగైలోని ప్రభుత్వ హాస్పిట‌ల్‌కు తరలించారు. ఆ తర్వాత స్థానిక యంత్రాంగం, పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాయి. కొంతమంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నందున...
ప్రపంచ రికార్డు బద్దలు: వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ.. అఫ్రిదిని వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర! – Rohit Sharma World Record
Sports

ప్రపంచ రికార్డు బద్దలు: వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ.. అఫ్రిదిని వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర! – Rohit Sharma World Record

Rohit Sharma World Record | టీమిండియా మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన రోహిత్, అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ ఈ ఘనత సాధించడానికి కేవలం మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను సమర్థంతంగా ఎదుర్కొన్న రోహిత్, కీలకమైన మూడు సిక్సర్లు బాది.. పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది రికార్డును అధిగమించాడు. అఫ్రిది తన కెరీర్‌లో 351 సిక్సర్లు కొట్టగా, రోహిత్ శర్మ ఇప్పుడు 352 సిక్సర్లతో అతన్ని వెనక్కి నెట్టాడు. మ్యాచ్‌లో మెరుపు ప్రదర్శన రాంచీలో జరిగిన ఈ వన్డేలో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటన నుంచి కొనసాగిస్తున్న అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడ...
error: Content is protected !!