మేడారంలో భక్తుల సందడి – మహాజారతకు ముందుగానే పెరుగుతున్న రద్దీ – Medaram Jathara 2025
Medaram Jathara 2025 : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత పొందిన సమ్మక్క–సారలమ్మల మహా జాతర (Sammakka Saralamma Jathara) జనవరి 28 నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో అత్యంత వైభవంగా జరిగే ఈ మహోత్సవానికి సమయం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లు (Medaram Jathara arrangements) ముమ్మరంగా సాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తుండగా ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
రాతి కట్టడాలతో దేవస్థానం పునరుద్ధరణ
మరోవైపు మేడారం దేవస్థానం పునరుద్ధరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శ్రీకారం చుట్టింది. వందలాది ఏళ్లయినా చెక్కుచెదరకుండా రాతి కట్టడాలతో నిర్మాణం చేపట్టేందుకు మాస్టర్ప్లాన్ను రూపొం...


