Urea Shortage | తెలంగాణలో యూరియా కొరతపై కేంద్రం క్లారిటీ
Availability of urea : ఖరీఫ్ సీజన్-2025లో తెలంగాణ (Telangana)కు యూరియాను రైతుల అవసరాలకు అదనంగానే సరఫరా చేశామని కేంద్రం ప్రకటించింది. యూరియా కొరత ఉండొచ్చని రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. తెలంగాణలో యూరియా కొరత లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టామని కేంద్ర రసాయన ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ (Minister of State for Fertilisers Anupriya Patel) తెలిపారు. ఈ రోజు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) అడిగిన ప్రశ్నకు ఆమె ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
యూరియా కొరతపై క్లారిటీ
ఖరీఫ్ సీజన్ (2025 Kharif season) సందర్భంగా తెలంగాణ రైతులకు అత్యంత కీలకమైన యూరియా ఎరువు (Fertiliser) సరఫరా గురించి కేంద్ర ప్రభుత్వం ఆశాజనకమైన సమాచారం ప్రకటించింది. యూరియా కొరత ఉండొచ్చని రైతులు అనుమానపడుతున్న సమయంలో కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఇచ్చిన...



