Sangareddy | సర్పంచ్ అభ్యర్థి అనుమానాస్పద మృతి- కాంగ్రెస్ నేత ఫామ్హౌజ్ సమీపంలో ఘటన
సర్పంచ్ అభ్యర్థి (sarpanch contestant) అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సంగారెడ్డి (Sangareddy) జిల్లా రాయికోడ్ (Raikode) మండలంలో ఈ రోజు వెలుగు చూసింది. పిప్పాడపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేసిన వల్కి రాజు మృతదేహం కాంగ్రెస్ (Congress) మండల అధ్యక్షుడు బాలాజీ నరసింహులు ఫామ్హౌజ్ సమీపంలో లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఫామ్హౌజ్కు వెళ్లాక ఏం జరిగింది?
స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ కార్యకర్త వల్కి రాజు తన స్వగ్రామం పిప్పాడపల్లి (Pippadpally) పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ (nomination) దాఖలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలాజీ నరసింహులును కలవడానికి గ్రామ శివారులో ఉన్న ఆయన ఫామ్హౌజ్కు వెళ్లారు. ఎన్నికల ప్రచారం (election campaign), విజయం సాధించడాన...

