Sarkar Live

Day: March 11, 2026

Chhattisgarh Maoists Surrender : చత్తీస్‌గఢ్‌లో ఒకేసారి 108 మంది లొంగుబాటు.. రూ. 3.95 కోట్ల రివార్డు!
National, Crime

Chhattisgarh Maoists Surrender : చత్తీస్‌గఢ్‌లో ఒకేసారి 108 మంది లొంగుబాటు.. రూ. 3.95 కోట్ల రివార్డు!

Chhattisgarh Maoists Surrender | దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, అటవీ ప్రాంతంలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టులు భారీగా జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. బుధవారం (మార్చి 11) నాడు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఏకంగా 108 మంది మావోయిస్టులు పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. రూ. 3.95 కోట్ల రివార్డు.. భారీగా ఆయుధాలు! లొంగిపోయిన ఈ 108 మంది మావోయిస్టులపై ప్రభుత్వం గతంలో ప్రకటించిన రివార్డుల విలువ మొత్తం రూ. 3.95 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. బస్తర్ డివిజన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ లొంగుబాటు కార్యక్రమంలో వారు తమ వద్ద ఉన్న 101 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ప్రాంతాల వారీగా లొంగిపోయిన వారి వివరాలు: దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన వివిధ ప్రాంతాల నుంచి మావోయిస్టులు తరలివచ్చారు: బీజాపూర్: 37 ...
దాహార్తిని తీర్చేందుకు గీసుగొండ పోలీసుల ముందడుగు
Crime, warangal

దాహార్తిని తీర్చేందుకు గీసుగొండ పోలీసుల ముందడుగు

కొనాయమాకుల స్టేజ్ వద్ద చలివేంద్రం ప్రారంభం ఎండలు ముదురుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గీసుగొండ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కొనాయమాకుల స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మామునూరు ఏసీపీ వెంకటేష్  బుధవారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏసీపి మాట్లాడుతూ గీసుగొండ సీ ఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం అభినందనీయమని అన్నారు.కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా, సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రయాణికులు, స్థానిక ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐ విశ్వేశ్వర్, ఎస్సైలు కుమార్, అనిల్ ,తోపాటు స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు....
దానం,కడియం లకు ఊరట…
Hyderabad

దానం,కడియం లకు ఊరట…

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది తీర్పును వెలువరించారు. గతంలో 8 మంది ఎమ్మెల్యేల విషయంలో అనుసరించిన నిర్ణయాన్నే పునరావృతం చేస్తూ, వీరిద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే, కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ ఆయనపై అనర్హత వేటు పడలేదు. కడియం శ్రీహరి వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన కుమార్తె కడియం కావ్యకు మద్దతుగా, కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేసినా ఆయన సభ్యత్వం సురక్షితమని స్పీకర్ తేల్చిచెప్పారు.గతంలో ఇతర ఎమ్మెల్యేల పిటిషన్లను ఏ ప్రాతిపదికన కొట్టివేశారో, అదే తరహాలో వీరిపై దాఖలైన ఫిర్యాదులను కూడా స్పీకర్ తోసిపుచ్చారు. ప్రతిపక్షాలకు షాక్? చట్టసభ నిబంధనల ప్రకారం ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ గట...
సర్కారు ధాన్యం భద్రమేనా?
Special Stories

సర్కారు ధాన్యం భద్రమేనా?

రూ.2కోట్ల ధాన్యం మాయం పై అనుమానాలు Hanumakonda Paddy Scam | ఆ మిల్లులో ప్రభుత్వ ధాన్యం భద్రంగా ఉందా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి నెలకొంది. హనుమకొండ జిల్లా అగ్రంపహాడ్ శివారులోని మహాదేవ ఇండస్ట్రీస్ వేదికగా సివిల్ సప్లైస్ ధాన్యం పక్కదారి పట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మిల్లులో ఉండాల్సిన ధాన్యంలో సుమారు రూ. 2 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు విశ్వసనీయ సమాచారం. రికార్డుల్లో ఉన్న లెక్కలకు.. మిల్లులో ఉన్న నిల్వకు భారీ తేడా?  2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పౌరసరఫరాల శాఖ 2991.920 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కోసం ఈ మిల్లుకు పంపించింది. నిబంధనల ప్రకారం.. మిల్లర్ ఆ ధాన్యాన్ని మరాడించి 2004.586 మెట్రిక్ టన్నులు  అంటే 70 ఏసికెల బియ్యాన్ని ప్రభుత్వానికి  తిరిగి అప్పగించాలి. అయితే, ఇప్పటివరకు ఆ మిల్లర్ పౌరసరఫరాల శాఖకు కేవలం 12 ఏసికెల బియ్యాన్ని మాత్రమే ప...
error: Content is protected !!