Sarkar Live

Day: March 23, 2026

కేసుల పరిష్కారానికి ‘రాజీ’యే రాజమార్గం: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్
Crime

కేసుల పరిష్కారానికి ‘రాజీ’యే రాజమార్గం: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోకుండా.. పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కక్షిదారులకు సూచించారు. ఈ నెల 28వ తేదీ (శనివారం) నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాజీ పడదగిన ప్రధాన కేసులు: లోక్ అదాలత్ ద్వారా ఈ క్రింది వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చు: క్రిమినల్ కంపౌండబుల్: చిన్నపాటి నేరాలకు సంబంధించిన కేసులు. సివిల్ & ఆస్తి: సివిల్ తగాదాలు మరియు ఆస్తి పంపకాల వివాదాలు. కుటుంబ వివాదాలు: భార్యాభర్తల మధ్య గొడవలు, వైవాహిక సమస్యలు. ఆర్థిక లావాదేవీలు: చెక్ బౌన్స్ కేసులు, బ్యాంక్ రికవరీ అంశాలు. ఇతరాలు: విద్యుత్ చౌర్యం వంటి వినియోగదారుల సమస్యలు. ముఖ్య విశేషాలు: త్వరితగతిన న్యాయం: లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కారమైతే తక్షణమే తీర్పు లభిస్తుంది. కౌన్సిలి...
Chicken Price Hike | చికెన్​ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. వెలుగుచూస్తున్న కుళ్లిన మాంసం దందా!
State, Hyderabad

Chicken Price Hike | చికెన్​ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. వెలుగుచూస్తున్న కుళ్లిన మాంసం దందా!

హైదరాబాద్: భాగ్యనగరంలో మాంసాహార ప్రియులకు ఇప్పుడు రెట్టింపు కష్టాలు వచ్చి పడ్డాయి. ఒకవైపు వేసవి తాపానికి చికెన్, మటన్ ధరలు (Chicken Price Hike) చుక్కలు చూపిస్తుంటే.. మరోవైపు కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ (GHMC) మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. Chicken Price Hike : ఆకాశాన్నంటుతున్న ధరలు: చికెన్ @ 400! వేసవి కాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గి, డిమాండ్ పెరగడం వల్ల చికెన్ ధరలు ఒక్కసారిగా భారమయ్యాయి. వారం రోజుల క్రితం వరకు కిలో రూ. 300 నుండి రూ. 320 మధ్య ఉండగా, ప్రస్తుతం అది రూ. 400 మార్కును తాకింది. మటన్ ధరలు: నగరంలోని పలు ప్రాంతాల్లో కిలో మటన్ రూ. 940 నుండి రూ. 1000 వరకు విక్రయిస్తున్నారు. నాణ్యత లోపం: ధరలు పెరగడమే కాకుండా, నాణ్యత లేని మాంసం విక్రయ...
భగత్ సింగ్ ఆశయ సాధన కోసం విద్యార్థి లోకం కదలాలి: తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు
Hyderabad

భగత్ సింగ్ ఆశయ సాధన కోసం విద్యార్థి లోకం కదలాలి: తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు

హైదరాబాద్, మార్చి 23: దేశంలో దోపిడీ, పీడన లేని సమాజ స్థాపన కోసం విప్లవ వీరుడు భగత్ సింగ్ స్ఫూర్తితో మరో పోరాటానికి విద్యార్థి, యువజనులు సిద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ (AISF) మాజీ జాతీయ అధ్యక్షులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు. సోమవారం నాడు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ రామ్ కోఠిలోని భగత్ సింగ్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విప్లవ ధ్రువతారలు భగత్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. బ్రిటిష్ వలస పాలన నుండి దేశాన్ని విముక్తి చేసేందుకు అనేకమంది ప్రాణత్యాగం చేశారని, అందులో చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ యువతకు నిత్య స్ఫూర్తి అని కొనియాడారు. 1907 సెప్టెంబర్ 28న జన్మించిన భగత్ సింగ్, జాతీయ భావాలు గల కుటుంబం నుండి వచ్చి దేశం కోసం బలిదానమయ్యారన...
ఉద్యమకారునికి అండగా పారిశ్రామికవేత్త అల్లం బాలకిశోర్ రెడ్డి: రూ. 50 వేల ఆర్థిక సాయం
warangal

ఉద్యమకారునికి అండగా పారిశ్రామికవేత్త అల్లం బాలకిశోర్ రెడ్డి: రూ. 50 వేల ఆర్థిక సాయం

గీసుకొండ, వరంగల్ జిల్లా: కష్టాల్లో ఉన్న ఉద్యమకారులను ఆదుకోవడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లం బాలకిశోర్ రెడ్డి చాటిచెప్పారు. గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామానికి చెందిన ఉద్యమకారుడు కోట ప్రవీణ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో, అతని వైద్య ఖర్చుల నిమిత్తం బాలకిశోర్ రెడ్డి 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. పారిశ్రామికవేత్త అల్లం బాలకిశోర్ రెడ్డి అందుబాటులో లేని కారణంగా, వారి ప్రతినిధిగా గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజకుమార్ స్వయంగా వెళ్లి ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా రాజకుమార్  మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ఏ కష్టం వచ్చినా బాలకిశోర్ రెడ్డి తోపాటు  తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆపద సమయంలో స్పందించి ఆర్థిక సాయం చేసినందుకు గీసుకొండ మండల ఉద్యమకారులు అల్లం బాలకిశోర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెల...
Paddy Scam | మిల్లుల్లో ‘నిల్’.. రికార్డుల్లో ‘ఫుల్’..
Special Stories

Paddy Scam | మిల్లుల్లో ‘నిల్’.. రికార్డుల్లో ‘ఫుల్’..

హరిహర, శ్రీలక్ష్మీ సాయి మిల్లుల్లో ధాన్యం మాయం! Warangal Rice Mill Paddy Scam | ప్రభుత్వ రికార్డుల్లో చూస్తే వేల క్వింటాళ్ల ధాన్యంతో ఆ మిల్లులు కళకళలాడుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో అడుగుపెడితే అక్కడ ఖాళీ గదులు దర్శనమిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, మిల్లు యజమానుల కాసుల కక్కుర్తి వెరసి ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతోంది. వరంగల్ జిల్లాలోని హరిహర ఇండస్ట్రీస్, శ్రీలక్ష్మీ సాయి బిన్నీ రైస్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నిబంధనలు బేఖాతరు.. ఇష్టారాజ్యం! కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కింద ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే, ఈ రెండు మిల్లుల యజమానులు నిబంధనలను తుంగలో తొక్కారు. కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నట్లు తీవ్ర ఆ...
error: Content is protected !!