Sarkar Live

Day: April 6, 2026

ప్రభుత్వ భూమి మాయం: సర్వే నెం. 95లో అన్యాక్రాంతం!
Special Stories

ప్రభుత్వ భూమి మాయం: సర్వే నెం. 95లో అన్యాక్రాంతం!

వరంగల్ జిల్లా యంత్రాంగం ముక్కు కిందే విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోంది. జిల్లా కలెక్టర్ నూతన కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉన్న గీసుగొండ మండలం గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 95 లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. సుమారు 10 గుంటలకు పైగా భూమిని అక్రమార్కులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నా, రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ​పేదల నీడకు ఎసరు.. రూ. కోట్ల భూమి స్వాహా! ​గతంలో ఇదే సర్వే నంబర్ 95లో అప్పటి ప్రభుత్వం సుమారు 600 మంది పేదలకు 'గరీబ్ నగర్' పేరుతో ఇళ్ల స్థలాలను కేటాయించింది. అయితే, గొర్రెకుంట ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ధరలకు రెక్కలు రావడంతో కబ్జాదారుల కన్ను ఈ మిగులు భూమిపై పడింది. అధికారుల కళ్లు గప్పి, రాత్రికి రాత్రే హద్దులు చెరిపేసి..  భూమిని కలుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ​అధికా...
గీసుగొండలో ఘోర రోడ్డు ప్రమాదం: టాటా ఏసీ ఢీకొని బైకర్ మృతి
warangal, State

గీసుగొండలో ఘోర రోడ్డు ప్రమాదం: టాటా ఏసీ ఢీకొని బైకర్ మృతి

అతివేగం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గీసుగొండ మండల పరిధిలోని హర్జా తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...​హైదరాబాద్‌లోని పురాణాపూల్‌కు చెందిన భూక్య రవి (36) వృత్తిరీత్యా డ్రైవర్. శనివారం (ఏప్రిల్ 04) తన పల్సర్ బైక్ (TS12 E 8265) పై సొంతూరు కొల్లాపురం (గూడూరు మండలం) కు వచ్చాడు. తిరిగి ఆదివారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో హైదరాబాద్‌కు బయలుదేరాడు. ​మార్గమధ్యలో గీసుగొండ మండలం హర్జా తండా గ్రామ శివారులోని ఓంకార్ స్తూపం మలుపు వద్దకు రాగానే, వరంగల్ వైపు నుండి నర్సంపేట వైపు వెళ్తున్న టాటా ఏసీ (AP20 TB 4305) వాహనం రవి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ​అక్కడికక్కడే మృతి.. ​టాటా ఏసీ డ్రైవర్ పొన్నం వంశీ వాహనాన్ని అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రవి బైక్ పైను...
ఆదిలాబాద్‌ ‘ఎయిర్‌పోర్ట్’ .. జూన్ 2న శంకుస్థాపన! పిప్రి సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు  ‌‌Adilabad
State

ఆదిలాబాద్‌ ‘ఎయిర్‌పోర్ట్’ .. జూన్ 2న శంకుస్థాపన! పిప్రి సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు ‌‌Adilabad

Revanth Reddy Adilabad Visit | రాజకీయాల్లో విశ్వాసం, విలువలే పునాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఉద్ఘాటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేపట్టిన 'పీపుల్స్ మార్చ్' పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై వరాల జల్లు కురిపిస్తూనే, గత ప్రభుత్వానికి భిన్నంగా తాము అనుసరిస్తున్న ప్రజాస్వామ్య విధానాలను వివరించారు. పీపుల్స్ మార్చ్ స్ఫూర్తితోనే అధికారం నాడు పిప్రి గడ్డ నుంచే భట్టి విక్రమార్క 1400 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారని సీఎం గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అందుకే ఆదిలాబాద్ జిల్లాపై తాము ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఆదిలాబాద్ ప్రజలు కేవలం అమాయకులు మాత్రమే కాదు, నిరంకుశత్వంపై పోరాడిన వీరులని ...
రాంపూర్‌లో ఉచిత వైద్య శిబిరం: 250 మందికి పరీక్షలు
warangal

రాంపూర్‌లో ఉచిత వైద్య శిబిరం: 250 మందికి పరీక్షలు

హన్మకొండ ములుగు రోడ్డులోని రియా హాస్పిటల్ మరియు రాంపూర్ గ్రామ పంచాయతీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రాంపూర్ గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం సందర్భంగా సర్పంచ్ రడం భరత్ విజ్ఞప్తి మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.​ఈ శిబిరంలో రియా హాస్పిటల్ కు చెందిన ప్రముఖ వైద్యులు పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు: ​డాక్టర్ వుప్పల రవీందర్ (MD, జనరల్ ఫిజీషియన్) ​డాక్టర్ గన్ను కృష్ణమూర్తి (MS, ఆర్థో - ఎముకల నిపుణులు) ​డాక్టర్ హర్షవర్ధన్ ​డాక్టర్ నర్సింహ స్వామి (గీసుగొండ) ​ముఖ్య విశేషాలు: ​గ్రామంలోని సుమారు 250 మంది రోగులకు ఉచితంగా OP (అవుట్ పేషెంట్) సేవలు అందించారు.వచ్చిన వారందరికీ రక్త పరీక్షలు మరియు షుగర్ టెస్టులు ఉచితంగా నిర్వహించారు.​కీళ్ల నొప్పులు, బిపి, షుగర్ మరియు ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు...
న్యూస్ 10 పత్రిక చీఫ్ ఎడిటర్ చెన్న రామకృష్ణకు పితృవియోగం: పత్తిపాకలో నేడు అంత్యక్రియలు
warangal

న్యూస్ 10 పత్రిక చీఫ్ ఎడిటర్ చెన్న రామకృష్ణకు పితృవియోగం: పత్తిపాకలో నేడు అంత్యక్రియలు

న్యూస్ 10 పత్రిక చీఫ్ ఎడిటర్ చెన్న రామకృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, విశ్రాంత ఉపాధ్యాయులు చెన్న లక్ష్మీనారాయణ ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో ఉన్న ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ​చెన్న లక్ష్మీనారాయణ మృతి పట్ల జర్నలిస్టు లోకం, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడిగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, రామకృష్ణ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.​కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. లక్ష్మీనారాయణ అంత్యక్రియలు నేడు హన్మకొండ జిల్లా, శాయంపేట మండలం, పత్తిపాక గ్రామంలోని వారి స్వగృహం వద్ద నిర్వహించనున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సన్నిహితులు, బంధువులు పత్తిపాకకు చేరుకుంటున్నారు....
error: Content is protected !!