Special Trains | రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వారంతపు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. వేసవి సెలవులు దగ్గరపడుతున్న తరుణంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 44 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొంది.
Special Trains : ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవీ..
- విశాఖపట్నం – బెంగళూరు (08581) మధ్య జూన్ ఒకటి నుంచి జూన్ 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం రైలు రాకపోకలు సాగిస్తుందని పేర్కొంది.
- ఇక బెంగళూరు-విశాఖపట్నం (08582) మధ్య జూన్ 2 నుంచి 30 వరకు ప్రతి సోమవారం రైలు నడుస్తుందని దక్షిణమధ్య రైల్వ వెల్లడించింది.
- విశాఖపట్నం – తిరుపతి (08547) రైలు జూన్ 4 నుంచి జులై 30 వరకు ప్రతి బుధవారం రైలు నడుస్తుంది
- విశాఖపట్నం-తిరుపతి (08548) రైలు జూన్ 5 నుంచి జులై 31 వరకు ప్రతి గురువారం రైలు నడుస్తుంది .
- విశాఖపట్నం-చర్లపల్లి (08579) రైలు జూన్ 6 నుంచి జులై 27 వరకు ప్రతి శుక్రవారం..
- చర్లపల్లి నుంచి – విశాఖపట్నం (08580) మధ్య రైలు జూన్ 7 నుంచి జులై 26 వరకు ప్రతి శనివారం నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.